Rabies: “రేబిస్” సోకిన ఆవు పాలతో ప్రసాదం.. ఊరంతా భయం భయం..
- రేబిస్ సోకిన ఆవు పాలతో ‘పంచామృతం’..
- భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rabies: ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ లోని ఒక గ్రామంలో ‘‘రేబిస్’’ కలకలం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల, రేబిస్ సోకిన ఒక ఆవు పాలతో ‘పంచామృతం’ ప్రసాదాన్ని చేశారు. ఆవు పచ్చిపాలతో దీనిని తయారు చేయడంతో ఇప్పుడు దీనిని సేవించిన గ్రామస్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. దాదాపుగా 200 మంది గ్రామస్తులు ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు. దీంతో వారందరూ వెంటనే యాంటీ-రేబిస్ టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఉరువా బ్లాక్ పరిధిలోని రాందిహ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం రేబిస్తో ఒక ఆవు చనిపోయింది. ఇది తెలియకుండానే ఆ వ్యాధి సోకిన ఆవు నుంచి వచ్చిన పాలను ఉపయోగించి ‘పంచామృతం’ తయారు చేసి, తిన్నారు. ఆవును మూడు నెలల క్రితం ఒక వీధి కుక్క కరిచింది. ఆవు రేబిస్ వ్యాధితో మరణించినట్లు పశు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు 170 మందికి పైగా గ్రామస్తులు రేబిస్ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆవు యజమాని సుశీల్ గౌర్ మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఆవును ఒక కుక్క కరిచింది. ఆ సమయంలో దానికి టీకాలు వేయించినట్లు చెప్పారు. అయితే, టీకాలు వేయించినప్పటికీ దానికి నిరంతర చికిత్స అవసరం అని తమకు తెలియదని, ఆవు చనిపోవడానికి ముందు రేబిస్ నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ సంఘటనపై, వైద్యారోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. పంచామృతం తిన్న వారందరికి మూడు డోస్ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న మూడు రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వబడుతుందని, చివరి డోస్ ఏడవ రోజున ఇవ్వబడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!