Rabies: “రేబిస్” సోకిన ఆవు పాలతో ప్రసాదం.. ఊరంతా భయం భయం..
- రేబిస్ సోకిన ఆవు పాలతో ‘పంచామృతం’..
- భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rabies: ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ లోని ఒక గ్రామంలో ‘‘రేబిస్’’ కలకలం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల, రేబిస్ సోకిన ఒక ఆవు పాలతో ‘పంచామృతం’ ప్రసాదాన్ని చేశారు. ఆవు పచ్చిపాలతో దీనిని తయారు చేయడంతో ఇప్పుడు దీనిని సేవించిన గ్రామస్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. దాదాపుగా 200 మంది గ్రామస్తులు ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు. దీంతో వారందరూ వెంటనే యాంటీ-రేబిస్ టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు.
Also Read
ఉరువా బ్లాక్ పరిధిలోని రాందిహ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం రేబిస్తో ఒక ఆవు చనిపోయింది. ఇది తెలియకుండానే ఆ వ్యాధి సోకిన ఆవు నుంచి వచ్చిన పాలను ఉపయోగించి ‘పంచామృతం’ తయారు చేసి, తిన్నారు. ఆవును మూడు నెలల క్రితం ఒక వీధి కుక్క కరిచింది. ఆవు రేబిస్ వ్యాధితో మరణించినట్లు పశు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు 170 మందికి పైగా గ్రామస్తులు రేబిస్ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆవు యజమాని సుశీల్ గౌర్ మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఆవును ఒక కుక్క కరిచింది. ఆ సమయంలో దానికి టీకాలు వేయించినట్లు చెప్పారు. అయితే, టీకాలు వేయించినప్పటికీ దానికి నిరంతర చికిత్స అవసరం అని తమకు తెలియదని, ఆవు చనిపోవడానికి ముందు రేబిస్ నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ సంఘటనపై, వైద్యారోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. పంచామృతం తిన్న వారందరికి మూడు డోస్ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న మూడు రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వబడుతుందని, చివరి డోస్ ఏడవ రోజున ఇవ్వబడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!