Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
- డిసెంబర్ 4-5 తేదీల్లో రష్యా అధ్యక్షుడి భారత పర్యటన..
- పుతిన్ పర్యటనలో కీలకంగా చమురు, రక్షణ, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గత సంవత్సరం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతాయని భారత్ చెప్పింది.
భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి. ఈ పర్యటన చాలా ముఖ్యమని, రెండు దేశాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం రష్యన్ – భారత్ సంబంధాలను మరింత పెంచుతాయని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ విజిట్ కు వస్తున్న పుతిన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికి, ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. చివరిసారిగా పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో భారత్లో పర్యటించారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
Read Also: Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యన్ తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేశాయి. భారత్ మరిన్ని యూనిట్లను రష్యా నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే మూడు స్వ్కాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు వచ్చే ఏడాది వచ్చే ఏడాది మధ్యకు అందుతాయి. పుతిన్ పర్యటన సందర్భంగా S-400 వాయు రక్షణ వ్యవస్థల డెలివరీలో జాప్యం గురించి భారత ప్రభుత్వం లేవనెత్తనుంది.
అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును భారత్ తగ్గించింది. దీంతో రష్యా మరిన్ని డిస్కౌంట్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే, భారత్ రష్యా నుంచి 5వ తరం యుద్ధ విమానం Su-57 ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసే విషయంపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, రష్యా భారత్కు Su-57 ఫైటర్ జెట్ల సాంకేతికతతో పాటు భారత్లో తయారీని కూడా ఆఫర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం కూడా మోడీ, పుతిన్ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..