Punjab: రేపే పంజాబ్ ప్రభుత్వ తొలి మంత్రివర్గ విస్తరణ.. 5గురికి అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన తొలి మంత్రివర్గాన్ని సోమవారం విస్తరించబోతోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. కొత్తగా ఐదుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్లో మూడు నెలల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం. పంజాబ్ రాజ్భవన్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం కొత్తగా మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పంజాబ్ మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరిగినట్లు, మంత్రుల పేర్లు కూడా చర్చకు వచ్చినట్లు పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ ఆ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ గురించి ఎలాంటి చర్చ జరగలేదని.. పంజాబ్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు.
Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
టీవల జరిగిన సంగ్రూర్ లోక్సభ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతోపాటు పంజాబ్లో కూడా రాబోయే కాలంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా అందుకు తగ్గట్టుగానే సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం కొత్త మంత్రులు ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. కొత్తగా ఐదుగురు మంత్రులను తీసుకోనుండటంతో మాన్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఆయనతో కలిపి 15కు చేరుతుంది. మంత్రివర్గంలో కొత్తగా చేర్చుకునే వారిలో సునం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అమన్ అరోరా, జగ్రావ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన సర్వజిత్ కౌర్ మనుకే, తల్వాండి సబో నుంచి రెండుసార్లు గెలిచిన బల్జీందర్ కౌర్, బుద్లాడా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్, అమృత్సర్ సౌత్ ఎమ్మెల్యే సింగ్ నిజ్జర్, ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనంతరం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 10 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 5గురిని తీసుకుంటే కేబినెట్ 15 మంది మంత్రులు ఉండనున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!