Pune Rape Case: అత్యాచార కేసులో డిఫెన్స్ లాయర్ సంచలన వ్యాఖ్యలు
- పూణె అత్యాచార కేసులో నిందితుడిని పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు
- మార్చి 12 వరకు పోలీస్ కస్టడీలో రాందాస్
- రెండు రోజులు చెరుకు తోటలో మకాం
- ఆకలి, దాహం వేయడంతో గ్రామంలోకి ప్రవేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 25న (మంగళవారం) ఉదయం 6 గంటలకు అత్యంత రద్దీగా ఉండే పూణెలోని స్వర్గేట్ బస్సు డిపోలో యువతి(26)పై దత్తాత్రే రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో 13 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పట్టాయి. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Akhanda 2: హిమాలయాల బాటపట్టిన బోయపాటి
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
అయితే నిందితుడు రాందాస్.. సంఘటనాస్థలి నుంచి పారిపోయి స్వస్థలంలోని సమీప పొలాల్లోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. రెండు రోజుల పాట చెరుకు తోటలోనే మకాం పెట్టాడు. అయితే రెండు రోజుల పాటు ఆకలితో అల్లాడిపోయాడు. తాగేందుకు కూడా కనీసం నీళ్లు దొరకలేదు. ఓ వైపు గొంతెండి పోయింది.. ఇంకోవైపు కడుపు కాలిపోయింది. మరోవైపు పోలీసులు వెంటాడుతున్నారన్న భయం ఉంది. ఇలా రెండు రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అయితే అప్పటికే పోలీసులు బృందాలుగా విడిపోయి వేట సాగిస్తున్నారు. డ్రోన్లు, కుక్కలతో వెంటాడుతున్నారు. డ్రోన్ ద్వారా నిందితుడు చెరుకు తోటలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే చెరుకు తోట ఎత్తుగా ఉండడం వల్ల వెంటనే సాధ్యం కాలేదు. అయితే అప్పటికే నిందితుడు ఆకలి, నీళ్లు లేక గిజగిజలాడిపోతున్నాడు. దీంతో సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి.. తినేందుకు భోజనం, నీళ్లు ఇవ్వాలని కోరాడు. అయితే ఆ ఇంటి యాజమాని వెంటనే నీళ్లు అందించాడు. అనంతరం పూణె పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సోదరుడికి పోన్ చేసి సమాచారం అందించాడు. అతడు.. సీనియర్ ఆఫీసర్లుకు తెలియజేయగా.. వెంటనే వచ్చి గురువారం రాత్రి 10:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుడిని కోర్టులో హాజరు పరచగా మార్చి 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే నిందితుడు తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశాడు. యువతి సమ్మతితోనే రాందాస్ కలుసుకున్నారని.. న్యాయవాది వాజిద్ ఖాన్ కోర్టుకు తెలిపారు. నిందితుడు.. బాధితురాలి మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే.. బస్సులో కలుసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం ఏర్పడిందని వెల్లడించారు.
నిందితుడిపై పూణె, అహల్యానగర్ జిల్లాల్లో దొంగతనం, దోపిడీ, గొలుసు దొంగతనం వంటి అర డజను కేసులు ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి బెయిల్పై బయట తిరుగుతున్నాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్.. మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!