Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulwama attack architect Asim Munir to be Pakistan’s new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్ కూడా వ్యవహరిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
2019లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడులకు కుట్ర పన్నిన వ్యక్తి అసిమ్ మునీర్. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో మునీర్, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. ఈ సమయంలోనే ఆ దాడి జరిగింది. కాశ్మీర్ లోని ప్రతీ ప్రాంతం గురించి అతనికి పట్టు ఉందని జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్ దేవాషెర్ అన్నారు. పుల్వామా దాడి తర్వాతే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడుల తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తో పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను హతమార్చారు. పుల్వామా దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కారణం అయినప్పటికీ..దీని వెనక ఐఎస్ఐ, పాక్ సైన్యం ఉంది. ముఖ్యంగా ఈ ప్లాన్ ఆర్టిటెక్ట్ గా అసిమ్ మునీర్ ఉన్నాడు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
ఇదిలా ఉంటే అసిమ్ మునీర్ కూడా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు అతను కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. పుల్వామా దాడి దృష్ట్యా భారత్, పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్తాన్ సంబంధాలపై కొత్త ఆర్మీ చీఫ్ ప్రభావం చూపిస్తారని.. అలాగే పాకిస్తాన్ చిరకాల మిత్రుడు చైనా, అమెరికా సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాడని భారత్ భావిస్తోంది.
భారత్ తో ఉద్రిక్తతలు పెంచేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ..ఉగ్రవాదులను ఆశ్రయిస్తుంది. అయితే గతంలో మాదిరి కాకుండా భారత్ ఇప్పుడు దృఢ వైఖరితో ఉంది. ఒక వేళ పాకిస్తాన్ ఆర్మీ కానీ, ఉగ్రవాదులు కానీ ఏదైనా చర్య చేపడితే.. మరో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్తాన్ కు తెలుసు. దీనికి తోడు భారత్ సందు దొరికితే పీఓకే, గిల్గిత్-బాల్టిస్థాన్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్లుగానే భారత రక్షణ మంత్రి, భారత సైన్యం పలుమార్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో ఇండియాపై పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!