Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulwama attack architect Asim Munir to be Pakistan’s new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్ కూడా వ్యవహరిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
2019లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడులకు కుట్ర పన్నిన వ్యక్తి అసిమ్ మునీర్. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో మునీర్, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. ఈ సమయంలోనే ఆ దాడి జరిగింది. కాశ్మీర్ లోని ప్రతీ ప్రాంతం గురించి అతనికి పట్టు ఉందని జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్ దేవాషెర్ అన్నారు. పుల్వామా దాడి తర్వాతే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడుల తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తో పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను హతమార్చారు. పుల్వామా దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కారణం అయినప్పటికీ..దీని వెనక ఐఎస్ఐ, పాక్ సైన్యం ఉంది. ముఖ్యంగా ఈ ప్లాన్ ఆర్టిటెక్ట్ గా అసిమ్ మునీర్ ఉన్నాడు.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
Read Also: North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
ఇదిలా ఉంటే అసిమ్ మునీర్ కూడా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు అతను కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. పుల్వామా దాడి దృష్ట్యా భారత్, పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్తాన్ సంబంధాలపై కొత్త ఆర్మీ చీఫ్ ప్రభావం చూపిస్తారని.. అలాగే పాకిస్తాన్ చిరకాల మిత్రుడు చైనా, అమెరికా సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాడని భారత్ భావిస్తోంది.
భారత్ తో ఉద్రిక్తతలు పెంచేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ..ఉగ్రవాదులను ఆశ్రయిస్తుంది. అయితే గతంలో మాదిరి కాకుండా భారత్ ఇప్పుడు దృఢ వైఖరితో ఉంది. ఒక వేళ పాకిస్తాన్ ఆర్మీ కానీ, ఉగ్రవాదులు కానీ ఏదైనా చర్య చేపడితే.. మరో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్తాన్ కు తెలుసు. దీనికి తోడు భారత్ సందు దొరికితే పీఓకే, గిల్గిత్-బాల్టిస్థాన్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్లుగానే భారత రక్షణ మంత్రి, భారత సైన్యం పలుమార్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో ఇండియాపై పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!