UGC Protests: యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు.. అసలేం జరిగిందంటే..!
- యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు
- దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- తక్షణమే కొత్త రూల్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూజీసీ-2026 కొత్త నిబంధనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనవరి 13న జారీ చేసిన రూల్ 3(c) ఏకపక్షంగా.. వివక్షతతో కూడిందని.. రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ అగ్ర కులాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాయలం ఎదుట నిరసనకు దిగారు. పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. తక్షణమే కొత్త నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు యూజీసీ కొత్త నిబంధన రగడ సృష్టిస్తోంది.
విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే పేరుతో జనరల్ కేటగిరీ పట్ల యూజీసీ వివక్షను ప్రోత్సహిస్తుందని.. అంతేకాకుండా కొన్ని సమూహాలు విద్యకు దూరం కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషనర్ పేర్కొన్నాడు.
Also Read
వేముల రోహిత్ ఆత్మహత్య
2026లో హైదరాబాద్ యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆనాడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే తాజాగా క్యాంపస్ల్లో కుల వివక్షను తొలగించేందుకు 2012 నిబంధనలను నవీకరించింది. కొత్త నియమాలు జోడించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా వెనుకబడిన తరగతి విద్యార్థులు కూడా కుల వివక్ష గురించి ఫిర్యాదు చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనే దేశ వ్యా్ప్తంగా ఆందోళనలు రేకెత్తింది. అగ్ర కులాల వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి విద్యకు దూరం చేయాలని భావిస్తోందని ధ్వజమెత్తారు. ఎటువంటి పరిశీలన చేయకుండా ఎలా నిబంధనలు సడలిస్తారని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
అయితే వేముల రోహిత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. యూజీసీకి చెందిన 2012 వివక్షత నిరోధక నియమాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సుప్రీం ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో యూజీసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అయితే అగ్ర కులాలకు చెందిన వారు మాత్రం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రకంపనలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
-
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!