Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
- సమీపిస్తున్న బెంగాల్ ఎన్నికల సమయం
- ఎన్నికల వేళ మమత మాస్టర్ ప్లాన్!
- ఒక వర్గం ఓట్ల కోసం కొత్త ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఒకరేమో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రాయం పడుతుంటే.. ఇంకొకరేమో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
Also Read
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం మాస్టర్ ప్లానే వేసినట్లుగా తెలుస్తోంది. ముస్లిం నేతృత్వంలోని ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను పొందుతోంది. అయితే ఈ మధ్య టీఎంసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముర్షిదాబాద్లోని బెల్దంగాలో జాతీయ రహదారి 12 వెంబడి బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ను సస్పెండ్ చేసింది. అతడు జనతా ఉన్నయన్ పార్టీ (JUP) పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ముస్లింలంతా అధికార పార్టీ నుంచి వైదొలగాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు.
ఇది కూడా చదవండి: JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
అయితే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని వారాలే మిగిలి ఉండగా వారి ఓటు బ్యాంక్ను పోగొట్టుకోకూడదని మమత భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముస్లింల నేతృత్వంలోని రాజకీయ సంస్థల మధ్య ఒక మైనారిటీ ఫ్రంట్ను ఏర్పాటు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు వల్ల మమతా బెనర్జీ తిరిగి ముస్లింల ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా అధికారాన్ని కాపాడుకోవచ్చు. తిరిగి నాలుగోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మమత తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 27 శాతం ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, బిర్భూమ్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో మైనారిటీ ఓటర్లు ఫలితాలను నిర్ణయాత్మకంగా మార్చగల డజన్ల కొద్దీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలే టీఎంసీకి అఖండ విజయాలను అందించాయి. మాల్డాలో ఆ పార్టీ ఓట్ల శాతం 2021లో 53 శాతానికి పెరిగింది. ముర్షిదాబాద్లో అదే కాలంలో ఆ పార్టీ ఓట్ల వాటా 6 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది. రెండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ ప్రస్తుతం 28 సీట్లను కలిగి ఉంది. ఉత్తర దినాజ్పూర్లో ఆరు సీట్లలో నాలుగు సీట్లను ఆ పార్టీ నియంత్రిస్తోంది.
బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 100 సీట్లలో ముస్లింలు ప్రభావితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. దూరమైన ముస్లింలను దగ్గరకు తీసుకుని.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్కు రూ.75 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!