Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mamata Banerjee Master Plan During The Bengal Elections

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!

Published Date :January 27, 2026 , 12:40 pm
By Suresh Maddala
  • సమీపిస్తున్న బెంగాల్ ఎన్నికల సమయం
  • ఎన్నికల వేళ మమత మాస్టర్ ప్లాన్!
  • ఒక వర్గం ఓట్ల కోసం కొత్త ప్రణాళిక
Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఒకరేమో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రాయం పడుతుంటే.. ఇంకొకరేమో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ

Also Read

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
Add as a preferred
source on google

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం మాస్టర్ ప్లానే వేసినట్లుగా తెలుస్తోంది. ముస్లిం నేతృత్వంలోని ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను పొందుతోంది. అయితే ఈ మధ్య టీఎంసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో జాతీయ రహదారి 12 వెంబడి బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేసింది. అతడు జనతా ఉన్నయన్ పార్టీ (JUP) పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ముస్లింలంతా అధికార పార్టీ నుంచి వైదొలగాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు.

ఇది కూడా చదవండి: JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు

అయితే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని వారాలే మిగిలి ఉండగా వారి ఓటు బ్యాంక్‌ను పోగొట్టుకోకూడదని మమత భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముస్లింల నేతృత్వంలోని రాజకీయ సంస్థల మధ్య ఒక మైనారిటీ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు వల్ల మమతా బెనర్జీ తిరిగి ముస్లింల ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా అధికారాన్ని కాపాడుకోవచ్చు. తిరిగి నాలుగోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మమత తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 27 శాతం ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, బిర్భూమ్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో మైనారిటీ ఓటర్లు ఫలితాలను నిర్ణయాత్మకంగా మార్చగల డజన్ల కొద్దీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలే టీఎంసీకి అఖండ విజయాలను అందించాయి. మాల్డాలో ఆ పార్టీ ఓట్ల శాతం 2021లో 53 శాతానికి పెరిగింది. ముర్షిదాబాద్‌లో అదే కాలంలో ఆ పార్టీ ఓట్ల వాటా 6 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది. రెండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ ప్రస్తుతం 28 సీట్లను కలిగి ఉంది. ఉత్తర దినాజ్‌పూర్‌లో ఆరు సీట్లలో నాలుగు సీట్లను ఆ పార్టీ నియంత్రిస్తోంది.

బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 100 సీట్లలో ముస్లింలు ప్రభావితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. దూరమైన ముస్లింలను దగ్గరకు తీసుకుని.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal elections
  • Mamata Banerjee
  • master plan
  • Minority unity
  • West Bengal Elections

తాజావార్తలు

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions