UGC Protests: యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు.. అసలేం జరిగిందంటే..!
- యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు
- దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- తక్షణమే కొత్త రూల్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూజీసీ-2026 కొత్త నిబంధనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనవరి 13న జారీ చేసిన రూల్ 3(c) ఏకపక్షంగా.. వివక్షతతో కూడిందని.. రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ అగ్ర కులాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాయలం ఎదుట నిరసనకు దిగారు. పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. తక్షణమే కొత్త నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు యూజీసీ కొత్త నిబంధన రగడ సృష్టిస్తోంది.
విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే పేరుతో జనరల్ కేటగిరీ పట్ల యూజీసీ వివక్షను ప్రోత్సహిస్తుందని.. అంతేకాకుండా కొన్ని సమూహాలు విద్యకు దూరం కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషనర్ పేర్కొన్నాడు.
Also Read
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
- Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
- Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
వేముల రోహిత్ ఆత్మహత్య
2026లో హైదరాబాద్ యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆనాడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే తాజాగా క్యాంపస్ల్లో కుల వివక్షను తొలగించేందుకు 2012 నిబంధనలను నవీకరించింది. కొత్త నియమాలు జోడించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా వెనుకబడిన తరగతి విద్యార్థులు కూడా కుల వివక్ష గురించి ఫిర్యాదు చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనే దేశ వ్యా్ప్తంగా ఆందోళనలు రేకెత్తింది. అగ్ర కులాల వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి విద్యకు దూరం చేయాలని భావిస్తోందని ధ్వజమెత్తారు. ఎటువంటి పరిశీలన చేయకుండా ఎలా నిబంధనలు సడలిస్తారని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
అయితే వేముల రోహిత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. యూజీసీకి చెందిన 2012 వివక్షత నిరోధక నియమాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సుప్రీం ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో యూజీసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అయితే అగ్ర కులాలకు చెందిన వారు మాత్రం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రకంపనలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Mixer Jar: మిక్సీ తిప్పినప్పుడల్లా మూత ఊడిపోతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా టైట్ చేసుకోండి!
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
West Bengal: “వాడికి ఇదే సరైన శిక్ష”.. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్కు జూలై 10న పండగే!
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!