Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. మరెంతో మంది ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఏకంగా ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తిసి ఆ శిశువు పూర్తిగా వృద్ధి చెందలేని తెలిసి తిరిగి కడుపులో పెట్టి కుట్టేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఏదో అల్మారాలో వస్తువు తీసి అదికాదు అన్నట్లుగా తిరిగి అల్మారాలో పెట్టేసినట్లుగా గర్భిణి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి ఆ బిడ్డ ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు ఓ వైద్యుడు. ఆ డాక్టర్ చేసిన ఘనకార్యం తెలిసి సదరు గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు.
Boat Accident: పడవ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
అస్సాం కరీంగంజ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఓ గర్భిణీ వచ్చింది. నవీ నమశూద్ర అనే ఏడు నెలల గర్భిణి నొప్పులతో డాక్టర్ వద్దకు వెళ్లి పరిస్థితిని చెప్పింది. ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ కుమార్ బిస్వాస్ ఆమె ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోలేదు. అంతేకాదు కనీసం ఆమెకు ఎన్ని నెలల గర్భం అని కూడా తెలుసుకోకుండానే డెలీవరీ చేయాలి అంటూ ఏకంగా సర్జరీ చేసేశాడు. తీరా బిడ్డను బయటకు తీశాక..అయ్యో పిండం ఇంకా పూర్తిగా శిశువుగా వృద్ధి చెందలేదు అని తెలుసుకుని తిరిగి బిడ్డను కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు. అదేదో వస్తువును డ్రాలో దాచినట్లుగా పెట్టి కుట్లేసి ఇంటికి పంపించివేశాడు. పది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. తిరిగి ఆస్పత్రికి రావడంతో ఆమెకు సర్జరీ జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేదా అంటూ విరుచుకుపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!