Lalu Yadav: “ల్యాండ్ ఫర్ జాబ్” స్కామ్.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్లపై ఛార్జీషీట్ నమోదైంది. ఈ కేసులో గత అక్టోబర్ నెలలో ఢిల్లీ కోర్టు లాలూకి బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం లాలూ పార్టీ ఆర్జేడీ, నితిష్ కుమార్ జేడీయూతో కలిసి బీహార్లో అధికారంలో ఉంది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లాలూ కుటుంబానికి ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. ఇండియా కూటమిలో ఆర్జేడీ కీలక భాగస్వామిగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ముందు బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి తమను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Big Shock: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ ఏమిటి..?
2004-2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. రైల్వేలో తమకు అనుకూలమైన వ్యక్తులను రైల్వేలో నియమించాయని ఆరోపణలు ఉన్నాయి. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్లో ఉన్న వివిధ జోనల్ రైల్వేలో బీహార్కి చెందిన వారిని నియమించారు.
అయితే ఇలా నియమించడానికి లాలూ కుటుంబంలోని పలువురికి అభ్యర్థుల చాలా తక్కువ ధరకు భూమిని అమ్మారని, మార్కెట్ రేటులో పోలిస్తే కేవలం ఐదోవంతు ధరకే భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా భూములు ఇచ్చి, జాబులు తెచ్చుకున్నట్లు, దీనిలో లాలూ కుటుంబ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర సంస్థలు ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!