Pakistani Youtuber: “ఇండియా కంటెంట్పై మమ్మల్ని కిడ్నాప్ చేశారు”.. బతికే ఉన్న పాక్ యూట్యూబర్లు..
- ప్రో-ఇండియా కంటెంట్ చేసినందుక టార్చర్ చేశారు..
- బతికే ఉన్న ఉన్న పాకిస్తానీ యూట్యూబర్లు..
- 20 రోజుల తర్వాత బయటకు వచ్చిన సనా అమ్జాద్, షోయబ్ చౌదరి..
- పాకిస్తాన్ కోసం మాట్లాడటం ఆపమంటూ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Youtuber: పాకిస్తాన్ యూట్యూబర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రో-ఇండియా కంటెంట్ చేసే ప్రముఖ యూట్యూబర్ల అయిన సనా అమ్జాద్, సోయబ్ చౌదరిలు గత 21 రోజులుగా కనిపంచలేదు. వీరిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కిడ్నా్ప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీరే కాకుండా 10 మందికి పైగా యూట్యూబర్లు గత కొన్ని వారాలుగా పత్తా లేకుండా పోయారు. సనా అమ్జాద్, చౌదరిను అక్కడి ప్రభుత్వం ఉరి తీసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు ఆన్లైన్లోకి వచ్చారు. తాజాగా వీరి వీడియోలు యూట్యూబ్లో కనిపించాయి. ఇన్నాళ్లు వీరికి ఏమైందా అని అటు పాకిస్తాన్లో ఇటు భారత్ నెటిజన్లలో ఆందోళన నెలకొంది.
Read Also: Balasaheb Thackeray: హిందుత్వ విషయంలో బాలాసాహెబ్ రాజీ పడలేదు: పీఎం మోడీ..
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
తాము భారతీయ అనుకూల కంటెంట్ చేస్తున్నామని చెబుతూ ఒక రాజకీయ సమూహం తమను కిడ్నాప్ చేసిందని వీరిద్దరు అసలు విషయాన్ని వెల్లడించారు. తమ కంటెంట్ని ఆపాలని తమపై ఒత్తిడి చేశారని, తమను కిడ్నాప్ చేసి హింసించినట్లు వీరిద్దరు చెప్పారు. “తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, సాయుధులైన వ్యక్తులు నా ఇంటికి చొరబడి, నా కళ్ళకు గంతలు కట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. వారు నన్ను 3 వారాల పాటు హింసించారు” అని సోయబ్ చౌదరి చెప్పారు. ‘‘ నేను వారికి బహిరంగ సవాల్ చేస్తున్న.న నేను ఎవరికి భయపడను. ఎవరైనా పాకిస్తాన్కి హాని చేస్తుంటే, చట్టపరిధిలోనే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతా’’ అని అన్నారు.
సనా అమ్జాద్ కూడా తన బాధకరమైన పరిస్థితిని పంచుకుంది. తనను సైలెంట్ చేసేందుకు తన కుటుంబాన్ని బెదిరించారని, తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా తన తల్లిని హింసించారని ఆమె ఆరోపించింది. సనా అమ్జాద్ భారత ప్రగతి, అభివృద్ధిని ప్రశంసిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారత్ పరపతి, మోడీకి దక్కే గౌరవం గురించి యూట్యూబ్ కంటెంట్ చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కాంక్షించింది. ఒకానొక సమయంలో మోడీని ‘‘సింహం’’ అంటూ ప్రశంసించారు. ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల్లో, భారత్ అభివృద్ధి చెందుతుంటే, పాకిస్తాన్ ఎందుకు అప్పులపాలైందని తన వీడియోల్లో ప్రశ్నించింది.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!