Balasaheb Thackeray: హిందుత్వ విషయంలో బాలాసాహెబ్ రాజీ పడలేదు: పీఎం మోడీ..
- బాలాసాహెబ్ ఠాక్రే జయంతి..
- నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..
- తన విశ్వాసాల విషయంలో రాజీ పడలేదని ప్రశంస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు. ఎక్స్ వేదికగా ‘‘ బాలాసాహెబ్ థాకరే జీ జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయనను విస్తృతంగా గౌరవిస్తారు. ప్రజా సంక్షేమం పట్ల, మహారాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత గుర్తుంచుకుంటారు. ఆయన తన ప్రధాన విశ్వాసాల విషయంలో రాజీపడలేదు, భారతీయ సంస్కృతి యొక్క గర్వాన్ని పెంపొందించడానికి ఎల్లప్పుడూ దోహదపడ్డారు.’’ అని అన్నారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
జనవరి 23, 1926న పూణేలో జన్మించిన బాలాసాహెబ్ ఠాక్రే, నవంబర్ 17, 2012లో 86 ఏళ్ల వయసులో ముంబైలో మరణించారు. హిందుత్వం ఆధారంగా ‘‘శివసేన’’ పార్టీని స్థాపించారు. ఆయనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా నివాళులు అర్పిస్తూ.. ‘‘హిందూ హృదయ సామ్రాట్ పూజ్య బాలాసాహెబ్కి మహారాష్ట్ర నివాళులు’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఉపముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే కూడా ఆయనకు నివాళులు అర్పించారు.
హిందుత్వ ఆధారంగా ఏర్పడిన శివసేన. 2022లో విడిపోయింది. సహాజ భాగస్వామిగా పరిగణించే బీజేపీని కాదని ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకలవడంతో ఈ పరిణామం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే వైపు ఉండటంతో అతడిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్నాథ్ షిండే కూటమి ఘన విజయం సాధించింది. మరోవైపు బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయారు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!