Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్.. రోజుకో బ్యాగ్తో ప్రియాంక హల్చల్
- నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్
- రోజుకో బ్యాగ్తో ప్రియాంక హల్చల్
- హిందువులు, మైనార్టీలపై దాడులపై ఖండన
- బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్ను తగిలించుకుని హల్చల్ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆమె ఖండించారు. ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. ప్రియాంక తీరును బీజేపీ ఆక్షేపించింది. తాజాగా మంగళవారం కూడా పార్లమెంట్ సమావేశాలకు వస్తూ బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. బంగ్లాదేశ్ బ్యాగ్తో ప్రత్యక్షమయ్యారు. ప్రియాంకతో పాటు ప్రతిపక్ష ఎంపీలంతా బంగ్లాదేశ్ బ్యాగ్లతో ఐక్యంగా నిరసన తెలిపారు.

Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. హిందువులు, మైనార్టీలపై దాడులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది దాడులకు గురయ్యారు. తాజాగా ఈ దాడులను నిరసిస్తూ.. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవుల పక్షాల నిలబడండి అంటూ బ్యాగ్పై రాసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక సోమవారం పార్లమెంట్ వేదికగా జీరో అవర్లో ప్రియాంక మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తారు. హిందువులు, క్రైస్తవుల భద్రత కోసం ఢాకా దౌత్యవేత్తలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చించి బాధితులను ఆదుకునేలా చర్చలు జరపాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..
ఇక పాలస్తీనాకు మద్దతుగా బ్యాగ్ ధరించడంపై బీజేపీ తప్పుపట్టింది. వయనాడ్ ఎంపీ మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అయితే బీజేపీ ఆరోపణలను ప్రియాంక ఖండించారు. మహిళలు ఏం ధరించాలో బీజేపీ నేతలు డిసైడ్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు.
అక్టోబర్ 7, 2023 నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది పాలస్తీనీయులు ఆహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥ pic.twitter.com/qf47VDTdyS— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 17, 2024
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!