Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్.. రోజుకో బ్యాగ్తో ప్రియాంక హల్చల్
- నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్
- రోజుకో బ్యాగ్తో ప్రియాంక హల్చల్
- హిందువులు, మైనార్టీలపై దాడులపై ఖండన
- బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్ను తగిలించుకుని హల్చల్ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆమె ఖండించారు. ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. ప్రియాంక తీరును బీజేపీ ఆక్షేపించింది. తాజాగా మంగళవారం కూడా పార్లమెంట్ సమావేశాలకు వస్తూ బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. బంగ్లాదేశ్ బ్యాగ్తో ప్రత్యక్షమయ్యారు. ప్రియాంకతో పాటు ప్రతిపక్ష ఎంపీలంతా బంగ్లాదేశ్ బ్యాగ్లతో ఐక్యంగా నిరసన తెలిపారు.

Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. హిందువులు, మైనార్టీలపై దాడులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది దాడులకు గురయ్యారు. తాజాగా ఈ దాడులను నిరసిస్తూ.. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవుల పక్షాల నిలబడండి అంటూ బ్యాగ్పై రాసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక సోమవారం పార్లమెంట్ వేదికగా జీరో అవర్లో ప్రియాంక మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తారు. హిందువులు, క్రైస్తవుల భద్రత కోసం ఢాకా దౌత్యవేత్తలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చించి బాధితులను ఆదుకునేలా చర్చలు జరపాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..
ఇక పాలస్తీనాకు మద్దతుగా బ్యాగ్ ధరించడంపై బీజేపీ తప్పుపట్టింది. వయనాడ్ ఎంపీ మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అయితే బీజేపీ ఆరోపణలను ప్రియాంక ఖండించారు. మహిళలు ఏం ధరించాలో బీజేపీ నేతలు డిసైడ్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు.
అక్టోబర్ 7, 2023 నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది పాలస్తీనీయులు ఆహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥ pic.twitter.com/qf47VDTdyS— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 17, 2024
తాజావార్తలు
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!