One Nation One Election: జేపీసీ కమిటీలో ప్రియాంకాగాంధీకి చోటు!
- జేపీసీకి వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు
- జేపీసీ కమిటీలో ప్రియాంకాగాంధీకి చోటు!
- నాలుగు పేర్లు ప్రతిపాదించిన కాంగ్రెస్
- తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదన తిరస్కరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే ఒకే దేశం-ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీకి చోటు దక్కినట్లు తెలుస్తోంది. ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మనీష్ తివారీకి చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలిపై రాజ్యాంగ సవరణ బిల్లును ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
పార్లమెంట్లో ప్రస్తుతం బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే జమిలి ఎన్నికల బిల్లు పరిశీలనకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్దేయో భగత్ సింగ్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇండియా కూటమిలో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లు ప్రతిపాదించింది. టీఎంసీ నుంచి సాకేత్ గోఖలే, కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఫైనల్గా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!