Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ప్రధాని మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ
- షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా సమావేశం
- ఉద్రిక్తతల వేళ కీలక అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్లో పర్యటిస్తున్నారు. రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో ఇరాన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ, పెజెష్కియాన్ ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల తాజా పరిస్థితిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినట్లు ఇరాన్కు చెందిన సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్రిక్త పరిస్థితుల వేళ..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇరాన్కు భారత్ టాప్-10 వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. అయితే హార్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!

అంతకుముందు మార్చి 21న మోడీ, పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. జూన్లోనూ ఇరువురు నేతలు ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య పరిణామాలపై పెజెష్కియాన్ మోడీకి వివరించారు. ఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహనను మోడీ స్వాగతించడంతో పాటు శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం నిరంతర ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు.
అర్మేనియా ప్రధాని పాషిన్యాన్తోనూ మోడీ భేటీ
ఎస్సీవో సదస్సు సందర్భంగా మోడీ అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్తోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మాస్యూటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. పశ్చిమాసియా పరిస్థితితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్-అర్మేనియా సంబంధాలను మరింత లోతుగా, విస్తృతంగా తీసుకెళ్లేందుకు అర్మేనియాతో కలిసి పనిచేయాలని భారత్ ఎదురుచూస్తోందని మోడీ తెలిపారు.
పుతిన్తోనూ మోడీ భేటీ?
ఇదిలా ఉండగా.. మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..