Kangana Ranaut: రాహుల్పై విమర్శలు.. ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా
- ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్..
- ఎమర్జెన్సీ మూవీ చూడాలని రాహుల్ని అడిగితే మర్యాదగా వ్యవహరించలేదు..
- ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది.. ఆమె మాట్లాడటాన్ని ఎంజాయ్ చేశా: కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది. కానీ, ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం కంగనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమెను కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించారని చెప్పుకొచ్చింది. ఆ సంభాషణ నాకు గుర్తుండిపోతుంది.. ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది. ఆమెతో మాట్లాడటాన్ని నేను ఎంజాయ్ చేశానని మీడియాతో కంగనా రనౌత్ వెల్లడించారు.
Read Also: Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఇక, ఇంతకుముందు కూడా ఇదే విషయంపై కంగన మాట్లాడారు. పార్లమెంట్లో ప్రియాంక గాంధీని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరగా, ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారని తెలిపింది. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాం.. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన విషయం.. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించినట్లు చెప్పుకొచ్చింది. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాన అని పేర్కొనింది. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కంగనా చెప్పింది.
Read Also: Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
కాగా, ఎమర్జెన్సీ మూవీని థియేటర్లో విడుదల చేయాలనుకోవడం తన పొరపాటు అని నటి కంగనా తెలిపారు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’.. ఈ మూవీలో కంగనా రనౌత్ కథానాయికగా, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. రిలీజ్ ను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ కోర్టును సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు తెలిపింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేయడంతో.. వివాదాలకు దారి తీసేలా ఉన్న పలు సన్నివేశాలను తొలగించినట్లు పేర్కొన్నారు
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!