PM Modi: అన్నదాతలే ముఖ్యం.. ట్రంప్ టారిఫ్పై తేల్చిచెప్పిన మోడీ
- అన్నదాతలే ముఖ్యం
- ట్రంప్ టారిఫ్పై తేల్చిచెప్పిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ విధించిన సుంకాలపై మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘మాకు మా రైతుల ప్రయోజనాలే ప్రధానం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది.’’ అని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Tamannaah : ఆ సౌత్ స్టార్ నాకు క్షమాపణలు చెప్పాడు..
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
రష్యా ముడి చమురు కొనుగోలు చేయడంతో భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత 25 శాతం విధించగా.. తాజాగా జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించనుంది.
ఇది కూడా చదవండి: Motorola: గ్లామర్ టచ్ తీసుకొస్తున్న మోటరోలా.. కొత్త బ్రిలియంట్ ఎడిషన్ అనౌన్స్!
సుంకాలపై అమెరికా-భారత్పై చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. వ్యవసాయం, పాడి పరిశ్రమపై అమెరికా సుంకాల మినహాయింపు కోరుతోంది. అందుకు భారత్ అంగీకరించడం లేదు. ఈ రెండు కూడా భారతదేశానికి సెంటిమెంట్. అందుకోసం భారతప్రభుత్వం అంగీకారం తెల్పలేదు. దీంతో ఆగస్టు 1న భారత్పై 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. రష్యాతో సంబంధం పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "For us, the interest of our farmers is our top priority. India will never compromise on the interests of farmers, fishermen and dairy farmers. I know personally, I will have to pay a heavy price for it, but I am ready for it.… pic.twitter.com/W7ZO2Zy6EE
— ANI (@ANI) August 7, 2025
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!