PM Modi: బ్రిటిష్ కాలం నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త అడ్రస్ ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా కీలకమైన కార్యనిర్వాహక విధులను ఏకీకృతం చేయడానికి, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కొత్త అధునాతన సముదాయాన్ని ప్రారంభించారు.
సేవాతీర్థ్లో మూడు కీలక కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. ప్రధాని కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉన్నాయి. కర్తవ్య భవన్ 1, 2లలో కీలక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, విద్య, కార్పొరేట్ వ్యవహారాలు, వ్యవసాయం, న్యాయ మంత్రిత్వ కార్యాలయాలు ఇందులో ఉంటాయి. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో నిర్ణయాల్లో వేగం, శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది.
కొత్త సముదాయంలో డిజిటల్ ఇంటిగ్రేషన్, పబ్లిక్ ఇంటర్ఫేస్ జోన్లు, సెంట్రలైజ్డ్ రిసెప్షన్, ఆధునిక ఈ గవర్నెన్స్ సపోర్ట్, 4-స్టార్ GRIHA ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. భద్రత కోసం స్మార్ట్ యాక్సెస్ నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ నిఘా, ఆధునాతన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు ఉన్నాయి. ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్లలో ‘‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’’ అనే పబ్లిక్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.