Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu Flies In Fighter Jet In Assam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం తొలుత తేజ్పూర్లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరానికి చేరుకున్నారు. భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్న అనంతరం.. ఆమె ఫ్లయింగ్ సూట్ ధరించి, సుఖోయ్-30 విమానంలో విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. దీనిపై ట్విటర్ మాధ్యమంగా.. “అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో చారిత్రాత్మకంగా ప్రయాణించారు. ముర్ముతో కలిపి మొత్తం ముగ్గురు రాష్ట్రపతులు యుద్ధ విమానంలో ప్రయాణించగా.. మహిళా రాష్ట్రపతుల్లో ముర్ము రెండోవారు” అంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.
Vladimir Putin: పుతిన్కు ఘోర అవమానం.. పాపం నవ్వులపాలయ్యాడుగా!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ను ఆమె ప్రారంభించారు. అనంతరం గౌహతిలో మౌంట్ కంచెన్జంగా సాహసయాత్ర-2023ను కూడా ప్రారంభించారు. గౌహతిలోని గౌహతి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తన పర్యటనలోని చివరి రోజులో భాగంగా.. తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించారు. జూలై 2022లో దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని స్వీకరించిన అనంతరం.. రాష్ట్రపతి ముర్ముకు ఇది రెండో రాష్ట్ర పర్యటన. తమ రాష్ట్రానికి పర్యటించేందుకు రాష్ట్రపతి రావడానికి ముందు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ ప్రసాద్ ట్విటర్ మాధ్యమంగానూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆతిథ్యం ఇవ్వడానికి అస్సాం ఎదురుచూస్తోందని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కూడా!
Pakistan Crisis: పాకిస్తాన్పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!