Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu Flies In Fighter Jet In Assam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం తొలుత తేజ్పూర్లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరానికి చేరుకున్నారు. భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్న అనంతరం.. ఆమె ఫ్లయింగ్ సూట్ ధరించి, సుఖోయ్-30 విమానంలో విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. దీనిపై ట్విటర్ మాధ్యమంగా.. “అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో చారిత్రాత్మకంగా ప్రయాణించారు. ముర్ముతో కలిపి మొత్తం ముగ్గురు రాష్ట్రపతులు యుద్ధ విమానంలో ప్రయాణించగా.. మహిళా రాష్ట్రపతుల్లో ముర్ము రెండోవారు” అంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.
Vladimir Putin: పుతిన్కు ఘోర అవమానం.. పాపం నవ్వులపాలయ్యాడుగా!
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ను ఆమె ప్రారంభించారు. అనంతరం గౌహతిలో మౌంట్ కంచెన్జంగా సాహసయాత్ర-2023ను కూడా ప్రారంభించారు. గౌహతిలోని గౌహతి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తన పర్యటనలోని చివరి రోజులో భాగంగా.. తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించారు. జూలై 2022లో దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని స్వీకరించిన అనంతరం.. రాష్ట్రపతి ముర్ముకు ఇది రెండో రాష్ట్ర పర్యటన. తమ రాష్ట్రానికి పర్యటించేందుకు రాష్ట్రపతి రావడానికి ముందు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ ప్రసాద్ ట్విటర్ మాధ్యమంగానూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆతిథ్యం ఇవ్వడానికి అస్సాం ఎదురుచూస్తోందని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కూడా!
Pakistan Crisis: పాకిస్తాన్పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
తాజావార్తలు
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!