Manipur: మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు
- మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
- బీజేపీ నేతలు సమాలోచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది. అంతేకాకుండా అల్లర్ల తర్వాత తొలిసారి సెప్టెంబర్లో ప్రధాని మోడీ కూడా మణిపూర్ వెళ్లొచ్చారు. పరిస్థితులు సద్దుమణగడం.. పైగా 2027 వరకు ప్రభుత్వం కొనసాగింపునకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్ బీజేపీ నేతలు అధిష్టానంతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్లో మేనేజర్ ఏం చేశాడంటే..!
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఇంఫాల్ లోయకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి. రాబిండ్రో, సపమ్ రంజన్, హెచ్. డింగో సింగ్తో పాటు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్, బీజేపీ ఈశాన్య సమన్వయకర్త సంబిత్ పాత్రా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అపాయింట్మెంట్ కోరారు. సోమవారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అందుకు అధిష్టానం కూడా సంసిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ వారం గానీ.. వచ్చే వారం గానీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రితో సమావేశం తర్వాత తుది నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక బీజేపీ సీనియర్ నేత మీడియాకు తెలియజేశాడు. మణిపూర్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో అధికారంలోకి రావచ్చని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి
- Tags
- Amit Shah
- bjp
- Delhi
- government
- Manipur
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!