Prashant Kishor: ఈసారి దక్షిణాదిలో బీజేపీకి అనూహ్య విజయం.. ప్రశాంత్ కిషోర్ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్న దక్షిణాది అడ్డంకి ఈ సారి ఎన్నికల్లో అధిగమిస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందని ఆయన అన్నారు. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాషాయ పార్టీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుతుందని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేసులో ఉంటుందని అని జోస్యం చెప్పారు. ఒడిశాలో ఖచ్చితంగా నంబర్ వన్ అవుతుందని, పశ్చిమబెంగాల్లో బీజేపీ టీఎంసీ కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు.
అయితే, మొత్తం 540 స్థానాలున్న లోక్సభలో బీజేపీ 370 సీట్లు సాధించే అవకాశం లేదని, 300కు మించి సీట్లు సాధించొచ్చని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్లతో బీజేపీ 50 సీట్లను కూడా సాధించలేకపోయిందని, ఆపార్టీ 2014లో ఈ రాష్ట్రాల్లో 29 సీట్లు, 2019లో 47 స్థానాలను గెలిచిందని గుర్తు చేశారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
Read Also: Ex MLA Shakeel Son Arrest: షకీల్ కుమారుడు రహిల్ అరెస్ట్.. ఈనెల 22 వరకు రిమాండ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జగన్ మోహన్ రెడ్డి రావడం కష్టమే అని అన్నారు. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు, పశ్చిమ భారతదేశంలో బీజేపీ తన సత్తా చాటుతుందని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో కనీసం 100 స్థానాలు కోల్పోయేలా చేస్తేనే కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయని, అయితే, అది ప్రస్తుతం కుదరదని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు పర్యటనలను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పర్యటనలతో పోల్చారు. మీ పోరాటం ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటే మీరు మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తే ఎలా విజయం సాధిస్తారు.? అని కాంగ్రెస్ని ప్రశ్నించారు.
బీజేపీని ఆపడానికి వ్యూహాలు ఉన్నప్పటికీ, సోమరితనం వల్ల ప్రతిపక్షాలు నాశనం చేసుకున్నాయని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైతే రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుని, విశ్రాంతి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహాల్లో లోపాలు ఉన్నాయని నిందించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ సొంత గడ్డపై ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్లే బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..