Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో విద్యుత్ బంద్.. ప్రయాణికులు ఇబ్బందులు
- ఢిల్లీ ఎయిర్ పోర్టులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
- కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురి
- నిలిచిపోయిన చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు
- కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్లో ఇలా వ్రాశారు, ‘విద్యుత్ వైఫల్యం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం T3 పూర్తిగా చీకటిగా మారింది. కౌంటర్ లేదు, డీజీ లేదు, ఏదీ పని చేయడం లేదు”. అని తెలిపారు.
Salman Khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. రాజస్థాన్ యూట్యూబర్ అరెస్ట్..
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
పవర్ కట్ పై ఢిల్లీ ఎయిర్పోర్ట్ స్పందిస్తూ.. తాము ఫీడ్బ్యాక్ను గుర్తించామని, సంబంధిత బృందంతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే కరెంటు లేదని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం.. బ్యాగేజీ లోడింగ్, డీజీ ప్రయాణం, ఏసీ పని చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. కాగా.. విద్యుత్తు అంతరాయం విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. “ఎక్కువ AC లోడ్ కారణంగా పూర్తి శక్తికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు పట్టింది” అని పేర్రొన్నారు. డిజి యాత్ర సిస్టమ్ రీబూట్ చేయబడి.. వెంటనే పని చేయడం ప్రారంభించిందని చెప్పారు.
Delhi Metro : మరోసారి ఢిల్లీ మెట్రో వైరల్.. ఈ సారి ఏంటంటే..!
ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాలు విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఓ పవర్ స్టేషన్లో అగ్నిప్రమాదం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ విద్యుత్తో పాటు, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..
తాజావార్తలు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!