PM Modi: “కాంగ్రెస్కి రిమోట్ కంట్రోల్ పాలన అలవాటు”.. సోనియా గాంధీపై ప్రధాని విమర్శలు..
- రాజ్యసభలో కాంగ్రెస్పై ప్రధాని మోడీ ధ్వజం..
- కాంగ్రెస్ది రిమోట్ పాలన..
- సోనియా గాంధీపై విమర్శలు..
- ప్రతిపక్షాలు వాకౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మంగళవారం లోక్సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు జోక్యం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి చైర్మన్ జగదీప్ ధంఖర్ నిరాకరించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించడంపై ప్రతిపక్షాల వాకౌట్ జరిగింది. ‘‘ఈ వ్యక్తులు ఆటో పైలట్, రిమోట్ పైలట్లో ప్రభుత్వాన్ని నడపడం అలవాటు చేసుకున్నారు. వారికి పనిచేయడంపై నమ్మకం లేదు. ఎలా వేచి ఉండాలో తెలుసు’’ అని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తెరవెనక నుంచి సోనియాగాంధీ నడిపించారని, రిమోట్ పాలన జరిగిందని పలు సందర్భాల్లో బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని నోటి నుంచి ఈ విమర్శలు వచ్చాయి.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
Read Also: Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాము గత 10 ఏళ్లలో కష్టపడి పనిచేశామని, అభివృద్ధి కోసం ఎలాంటి అవకాశాన్ని వదలలేదని పీఎం అన్నారు. గత 10 ఏళ్లలో కేవలం ఎంపరైజర్ మాత్రమే అని, ఇప్పుడు ప్రధాన వింధు ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగిస్తుండగా, ప్రతిపక్షాలు ‘‘అబద్ధాలు చెప్పడం ఆపండి’’, ‘‘దయచేసి సిగ్గుపడండి’’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల తీరుపై ఛైర్మన్ ధంఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ అసత్యాలు వ్యాప్తి చేసే వారికి నిజం వినే ధైర్యం లేదు. ఈ విషయాన్ని దేశం మొత్తం గమనిస్తోంది. వారు సమాధానాలు వింటూ కూర్చోలేరు. వారికి అరవడం తప్ప వేరే మార్గం లేదు. వారు సభా సంప్రదాయాలనను అవమానపరుస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. నినాదాలు చేయడం, కేకలు వేయడం, పారిపోవడం ఇది వారి విధి అని అన్నారు. ఎమర్జెన్సీ గురించి ఈ రోజు ప్రధాని ప్రతిపక్షాలపై దాడిని మరింత తీవ్రం చేశారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..