CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది
- ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- ప్రెస్మీట్ అనంతరం కేంద్రమంత్రులు కరచాలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించిందని.. దీంతో ఆందోళనను విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే శనివారం కేంద్ర పెద్దలతో సీజేపీ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని.. తాము తమ నిరసనను విరమించుకుంటున్నామని ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ను ఈ ఉదయం ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధి బృందం పేర్కొంది. మంగళవారం నాటికి తమ ఇతర డిమాండ్లను కూడా నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.
‘‘మేము ప్రభుత్వ ప్రతినిధి బృందంతో మూడు విడతలుగా చర్చలు జరిపాము. కొన్ని రోజులుగా జంతర్ మంతర్ దగ్గర మేము చేస్తున్న నిరసనలో మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై దాఖలైన అన్ని చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో నిరసనకారులు లేదా నిర్వాహకులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. నీట్ పరీక్ష వాయిదా పడటంతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నది మా మూడవ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అంటే మా మొదటి డిమాండ్ అంగీకరించబడినట్టే.’’ అని జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపారు.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరుకాగా.. సీజేపీ ప్రతినిధి బృందంలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఉన్నారు. సీజేపీ ఆందోళనను విరమించుకున్న అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకాతో కరచాలనం చేశారు.
#WATCH दिल्ली: सरकार से बातचीत के बाद कॉकरोच जनता पार्टी के नेशनल स्पोक्सपर्सन आशुतोष रांका ने कहा, “हमने सरकारी डेलीगेशन के साथ 3 राउंड की बातचीत की। जंतर-मंतर पर हमारा प्रोटेस्ट, जो कई दिनों से चल रहा था, उसकी तीन मेन डिमांड थीं: धर्मेंद्र प्रधान का इस्तीफा, प्रोटेस्टर्स और… pic.twitter.com/xpH4fMnpwq
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
#WATCH दिल्ली: सरकार से बातचीत के बाद कॉकरोच जनता पार्टी(CJP) के मुख्य प्रवक्ता सौरव दास ने कहा, “हमारी दूसरी मांग थी कि प्रदर्शनकारियों के खिलाफ दर्ज सभी FIR, सिर्फ दिल्ली में ही नहीं बल्कि सभी भाजपा शासित और भाजपा सहयोगी राज्यों में, वापस ली जाएं। यह भी हमारी दूसरी मांग थी।… pic.twitter.com/LA57ykgR71
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
#WATCH | दिल्ली: कॉकरोच जनता पार्टी के आंदोलन वापस लेने के बाद केंद्रीय मंत्री जे.पी. नड्डा और जितेंद्र सिंह ने कॉकरोच जनता पार्टी के मुख्य प्रवक्ता सौरव दास और राष्ट्रीय प्रवक्ता आशुतोष रांका से हाथ मिलाया। pic.twitter.com/wUam8Oxxjy
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!