PM Modi: ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు ఇండియా కూటమి ప్లాన్ని బయటపెట్టాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ(ఎస్పీ)కి చెందిన కీలక నేత మరియా ఆలం ఇటీవల ఓ మైనారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఓట్ జిహాద్’’కి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖర్షీద్ మేనకోడలైన మరియా ఆలం చేసి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు గుజరాత్ లోని ఆనంద్ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన.. ‘‘ ఇండియా కూటమి ప్లాన్ని ఆ మహిళా నాయకురాలు బహిర్గతం చేసింది’’ అని అన్నారు. మరియా ఆలయం మాట్లాడుతూ, ముస్లింలు ఓట్ జిహాద్కి వెళ్లాలని, ఇండియా కూటమికి ఓటేయాలని కోరారు. ‘‘మదర్సా నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి కాదు, ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోంది. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచింది’’ అని ప్రధాని ఆరోపించారు.
Read Also: Prajwal Revanna Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను లీక్ చేసిన డ్రైవర్ మిస్సింగ్..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఈ ప్రకటనను కాంగ్రెస్ నేతలు ఎవరూ వ్యతిరేకించలేరని ప్రధాని అన్నారు. ఒక వైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సాధారణ వర్గాలను విభజించేందుకు ప్రయత్నిస్తుంది, మరోవైపు ఓటు జిహాద్ నినాదాన్ని లేవనెత్తుతోంది, ఇవి వారి ఉద్దేశాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెబుతున్నాకయని ప్రధాని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్లో జరిగి ఓ ర్యాలీలో మరియా ఆలం మాట్లాడుతూ.. ముస్లిం ఓటర్లు ‘‘ఓటు జిహాద్’’ ప్రారంభించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇది ఒక్కటే మార్గమని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు, కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై యూపీ పోలీసులు మారియా ఆలంతో పాటు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సల్మాన్ ఖుర్షీద్లపై వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే, సల్మాన్ ఖుర్షీద్ మాత్రం ఆమె వ్యాఖ్యన్ని సమర్థించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!