NTV Telugu Site icon

PM Modi: నేడు మహారాష్ట్రలో రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

Modi

Modi

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో సుమారు 7,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో ఆయన శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇది నాగ్‌పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

Read Also: AHA : కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’ “గొర్రె పురాణం”కి రికార్డు వ్యూస్

అలాగే, షిర్డీ విమానాశ్రయంలో రూ. 645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ టెర్మినల్ షిర్డీని సందర్శించే మతపరమైన పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సాయిబాబాకు సంబంధించిన వేప చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే, ముంబై, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read Also: Iran Israel War: హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 50 మంది ఉగ్రవాదులు మృతి

ఇక, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై.. అధునాతన సాంకేతికత- మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి రంగాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వనుంది. దీంతో పాటు చాట్‌బాట్ టెక్నాలజీ ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులకు కీలకమైన అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డేటాను అందించడానికి విద్యా సమీక్షా కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.