PM Narendra Modi:ఉజ్జయిని “మహాకాల్ లోక్ కారిడార్”ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో శివుడిని దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు.
Read Also: Dog Missing: తప్పిపోయిన పూజారి శునకం.. సీసీ కెమెరాలు శోధించి పట్టుకున్న పోలీసులు
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
గర్భగుడిలోకి ఒంటరిగా ప్రవేశించిన మోదీ అక్కడి పూజారులతో కలిసి 20 నిమిషాల పాటు పూజల్ని నిర్వహించారు. గర్భగుడిలో రుద్రాక్ష మాల పట్టుకుని 10 నిమిషాల పాటు ధ్యానం చేశారు. పూజలు ముగిసిన తర్వాత గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ఇండోర్ చేరుకున్న ప్రధాని మోదీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ స్వాగతం పలికారు.
రూ. 856 కోట్ల వ్యయంతో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు ‘ మహాకాల్ లోక్ కారిడార్’ మొదటి దశను ప్రారంభించారు. మొదటి దశను రూ.316 కోట్లతో డెవలప్ చేశారు. మహాకాల్ లోక్ కారిడార్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. 900 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కారిడార్, దేశంలోనే అతిపెద్ద కారిడార్లలో ఒకటి. ఇది ప్రసిద్ధ మహాకాళేశ్వర దేవాలయం చుట్టూ రుద్రసాగర్ సరస్సు చుట్టూ విస్తరించి ఉంది.
Ujjain, MP | PM Modi dedicates to the nation Shri Mahakal Lok to the nation. Phase I of the Mahakal Lok project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities.
CM Shivraj Singh Chouhan also present. pic.twitter.com/LAZAjErXu1
— ANI (@ANI) October 11, 2022
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!