PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- ఏడు సంవత్సరాల తర్వాత భారత్లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీ.
- “భారత్, చైనా పరస్పర బలాల నుంచి నేర్చుకోవచ్చు” అన్న జిన్పింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi-Xi Jinping: 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో, జిన్పింగ్ శనివారం భేటీ అయ్యారు. భారత్, చైనాలు తమ పరస్పర బలాల నుంచి నేర్చుకుని, ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి సాధించగలవని అన్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీతో చైనా అధ్యక్షుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై రెండు దేశాలు చర్చించినట్లు తెలుస్తోంది.
బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు చేసిన సానుకూల వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ స్వాగతించారు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో చైనా అందించిన సహకారానికి మోడీ థాంక్స్ చెప్పారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించిందని అన్నారు.
Also Read
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
తన పుట్టిన రోజైన జూన్ 15న భారత పర్యటనకు తనకు ఆహ్వానం వచ్చిందని జిన్పింగ్ తెలిపారు. గతంలో మోడీతో 21 సార్లు భేటీ అయినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశాల్లో కుదిరిన పలు ముఖ్యమైన అవగాహనలు భారత్-చైనా సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకెళ్తాయని అన్నారు.
ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు..
భారత్, చైనాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవడం, పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా రెండు దేశాలు ఉమ్మడి విజయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చని జిన్పింగ్ అన్నారు. చైనా ఎప్పుడూ భారత్తో సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తాయని చెప్పారు. ప్రపంచంలో చోటుచేసుకున్న పరిణామాలు గత శతాబ్ధకాలంలో ఎప్పుడూ చూడలేదని, ఈ సవాళ్ల మధ్య ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్లో కీలక దేశాలుగా ఉన్న భారత్, చైనాలకు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. మానవాళి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రెండు దేశాలు కలిసి పనిచేయాలని జిన్పింగ్ సూచించారు.
తాజావార్తలు
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
-
BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!