Kartavya Path: నేడు “కర్తవ్యపథ్”ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కడానికి శిల్పులు 26,000 గంటలు పనిచేశారు. ఈ విగ్రహాన్ని నేడు మోదీ ఆవిష్కరించనున్నారు. 28 అడుగుల ఎత్తులో జెట్ బ్లాక్ గ్రానైట్ తో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఖమ్మం నుంచి ఈ గ్రానైట్ రాయిని తరలించారు. ఈ ఏకశిలా గ్రానైట్ ను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా 140 చక్రాల కలిగిన 100 అడుగుల ట్రక్కును ఏర్పాటు చేసి 1,665 కిలోమీటర్లు తరలించారు.
రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ రోజు కర్తవ్యపథ్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై ‘కర్తవ్య పథ్’గా వ్యవహరించనున్నారు. బ్రిటీస్ వారి హాయంలో ఈ మార్గాన్ని ‘కింగ్స్ వే’ పేరుతో పిలిచే వారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్ పథ్ గా మార్చారు. అయితే వలసపాలన, వలస చిహ్నాల పేర్లు మార్చాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ గా మారింది.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమూహంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్ మార్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే సెంట్రల్ విస్టా నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో గత 20 నెలల నుంచి ఈ మార్గాన్ని ప్రజలకు అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చుట్టూ పార్కులు, గ్రానైట్ వాక్ వే, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. నిత్యం 24 గంటల పాటు హై సెక్యూరిటీ ఉంటుంది. దారిపొడవునా మొత్తం 16 వంతెనలు, రెండు చోట్ల బోటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,125 వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్ద గ్రీనరీ కనబడేలా గార్డెన్లను అభివృద్ధి చేశారు. అక్కడి ప్రతీ చెట్టు ఎత్తు, దాని రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్ చేశారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!