Kartavya Path: నేడు “కర్తవ్యపథ్”ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ..
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కడానికి శిల్పులు 26,000 గంటలు పనిచేశారు. ఈ విగ్రహాన్ని నేడు మోదీ ఆవిష్కరించనున్నారు. 28 అడుగుల ఎత్తులో జెట్ బ్లాక్ గ్రానైట్ తో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఖమ్మం నుంచి ఈ గ్రానైట్ రాయిని తరలించారు. ఈ ఏకశిలా గ్రానైట్ ను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా 140 చక్రాల కలిగిన 100 అడుగుల ట్రక్కును ఏర్పాటు చేసి 1,665 కిలోమీటర్లు తరలించారు.
రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ రోజు కర్తవ్యపథ్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై ‘కర్తవ్య పథ్’గా వ్యవహరించనున్నారు. బ్రిటీస్ వారి హాయంలో ఈ మార్గాన్ని ‘కింగ్స్ వే’ పేరుతో పిలిచే వారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్ పథ్ గా మార్చారు. అయితే వలసపాలన, వలస చిహ్నాల పేర్లు మార్చాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ గా మారింది.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమూహంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్ మార్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే సెంట్రల్ విస్టా నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో గత 20 నెలల నుంచి ఈ మార్గాన్ని ప్రజలకు అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చుట్టూ పార్కులు, గ్రానైట్ వాక్ వే, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. నిత్యం 24 గంటల పాటు హై సెక్యూరిటీ ఉంటుంది. దారిపొడవునా మొత్తం 16 వంతెనలు, రెండు చోట్ల బోటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,125 వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్ద గ్రీనరీ కనబడేలా గార్డెన్లను అభివృద్ధి చేశారు. అక్కడి ప్రతీ చెట్టు ఎత్తు, దాని రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్ చేశారు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!