PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
- పాక్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..
- బెంగాల్ నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: CP CV Anand: భారత్లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, భారత మహిళల గౌరవాన్ని అవమానించిన “ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ బెంగాల్ గడ్డపై నుంచి ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని 140 కోట్ల మంది భారతీయుల తరుపున నేను చెబుతున్నా’’ అని మోడీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజల్లో కూడా చాలా కోపం వచ్చిందని, మీలో ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకున్నానని మోడీ అన్నారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే ధైర్యం చేశారని, మన సైన్యానికి వారి సిందూరమే శక్తిని ఇచ్చిందని అన్నారు.
Read Also: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
భారత్ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే, శత్రువులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఊహించని విధంగా దాడులు చేశాం, వారి ఇళ్లలోకి దూరి మూడుసార్లు దాడి చేశామని అన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి సామూహిక హత్యల్ని అతిపెద్ద నైపుణ్యంగా మార్చుకున్నాయని మోడీ విమర్శించారు. యుద్ధం జరిగినప్పుడల్లా వారు ఓటమిని ఎదుర్కుంటారని చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు దాడులు 2016లో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్లుగా పరిగణించబడుతున్నాయి.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!