PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
- పాక్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..
- బెంగాల్ నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: CP CV Anand: భారత్లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, భారత మహిళల గౌరవాన్ని అవమానించిన “ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ బెంగాల్ గడ్డపై నుంచి ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని 140 కోట్ల మంది భారతీయుల తరుపున నేను చెబుతున్నా’’ అని మోడీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజల్లో కూడా చాలా కోపం వచ్చిందని, మీలో ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకున్నానని మోడీ అన్నారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే ధైర్యం చేశారని, మన సైన్యానికి వారి సిందూరమే శక్తిని ఇచ్చిందని అన్నారు.
Read Also: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
భారత్ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే, శత్రువులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఊహించని విధంగా దాడులు చేశాం, వారి ఇళ్లలోకి దూరి మూడుసార్లు దాడి చేశామని అన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి సామూహిక హత్యల్ని అతిపెద్ద నైపుణ్యంగా మార్చుకున్నాయని మోడీ విమర్శించారు. యుద్ధం జరిగినప్పుడల్లా వారు ఓటమిని ఎదుర్కుంటారని చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు దాడులు 2016లో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్లుగా పరిగణించబడుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!