PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: CP CV Anand: భారత్లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, భారత మహిళల గౌరవాన్ని అవమానించిన “ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ బెంగాల్ గడ్డపై నుంచి ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని 140 కోట్ల మంది భారతీయుల తరుపున నేను చెబుతున్నా’’ అని మోడీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజల్లో కూడా చాలా కోపం వచ్చిందని, మీలో ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకున్నానని మోడీ అన్నారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే ధైర్యం చేశారని, మన సైన్యానికి వారి సిందూరమే శక్తిని ఇచ్చిందని అన్నారు.
Read Also: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
భారత్ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే, శత్రువులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఊహించని విధంగా దాడులు చేశాం, వారి ఇళ్లలోకి దూరి మూడుసార్లు దాడి చేశామని అన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి సామూహిక హత్యల్ని అతిపెద్ద నైపుణ్యంగా మార్చుకున్నాయని మోడీ విమర్శించారు. యుద్ధం జరిగినప్పుడల్లా వారు ఓటమిని ఎదుర్కుంటారని చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు దాడులు 2016లో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్లుగా పరిగణించబడుతున్నాయి.