PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
- పాక్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..
- బెంగాల్ నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: CP CV Anand: భారత్లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!
Also Read
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, భారత మహిళల గౌరవాన్ని అవమానించిన “ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ బెంగాల్ గడ్డపై నుంచి ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని 140 కోట్ల మంది భారతీయుల తరుపున నేను చెబుతున్నా’’ అని మోడీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజల్లో కూడా చాలా కోపం వచ్చిందని, మీలో ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకున్నానని మోడీ అన్నారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే ధైర్యం చేశారని, మన సైన్యానికి వారి సిందూరమే శక్తిని ఇచ్చిందని అన్నారు.
Read Also: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
భారత్ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే, శత్రువులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఊహించని విధంగా దాడులు చేశాం, వారి ఇళ్లలోకి దూరి మూడుసార్లు దాడి చేశామని అన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి సామూహిక హత్యల్ని అతిపెద్ద నైపుణ్యంగా మార్చుకున్నాయని మోడీ విమర్శించారు. యుద్ధం జరిగినప్పుడల్లా వారు ఓటమిని ఎదుర్కుంటారని చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు దాడులు 2016లో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్లుగా పరిగణించబడుతున్నాయి.
తాజావార్తలు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!