India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
- ట్రంప్ వాదనల్ని కొట్టిపారేసిన భారత్..
- పాక్తో కాల్పుల విరమణ చర్చల్లో సుంకాల ప్రస్తావనే లేదు..
- స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ..
India on Trump: ఆపరేషన్ సిందూర్తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు. ‘‘యుద్ధం ముగించకుంటే సుంకాల పేరుతో బెదిరింపుతోనే అమెరికా మధ్యవర్తిగా భారత్-పాక్ మధ్య కాల్పులు విరమణ కుదిరింది’’ అని చెప్పాడు.
తమ సుంకాల బెదిరింపు రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సహాయపడిందని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ముందు చెప్పింది. ట్రంప్ ప్రతిపాదించిన విస్తృత సుంకాలపై చట్టపరమైన ఎదురుదెబ్బ తగలకుండా ఉండటానికి అతడి అధికారులు కోర్టు ముందుకు చివరి ప్రయత్నంగా ఈ విషయాన్ని తీసుకువచ్చారు. “అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే ప్రతికూల తీర్పు భారతదేశం మరియు పాకిస్తాన్లు ట్రంప్ ఆఫర్ చెల్లుబాటును ప్రశ్నించేలా చేస్తుంది, ఇది మొత్తం ప్రాంతం యొక్క భద్రతకు మరియు లక్షలాది మంది జీవితాలకు ముప్పు కలిగిస్తుంది” అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కోర్టుకు తెలిపారు.
Also Read
Read Also: DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..
అయితే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో చర్చల సందర్భంగా సుంకాల అంశం ప్రస్తావనకు రాలేదని భారత్ తన వైఖరిని గురువారం పునరుద్ఘాటించింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన పరిపాలన చెప్పినవంతా అబద్ధాలే అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరోక్షంగా చెప్పింది. ‘‘ఈ ప్రత్యేక అంశంపై భారత్ వైఖరిని వ్యక్తీకరించాం. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న విరమణ సమయం వరకు, భారతదేశం మరియు అమెరికా మధ్య సంభాషణ జరిగింది. చర్చ సమయంలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు’’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ దాడికి ప్రతీకారంగా, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాక్, పీవోకేలోని 09 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం, భారత్ లోని మిలిటరీ, సివిల్ ఆస్తులపై దాడులకు తెగబడింది. దీనికి అంతే ధీటుగా భారత్ పాకిస్తాన్లోని 11 ఎయిర్బేస్లపై దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!