PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్లో మోడీ పర్యటన
- జూన్ 6న జమ్మూకాశ్మీర్లో మోడీ పర్యటన
- పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. ఇంతలో మూడు రోజులు వ్యవధిలో ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఇది కూడా చదవండి: XChat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్చాట్.. మొబైల్ నంబర్ లింక్ చేయకుండానే వాడుకోవచ్చు
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
జూన్ 6న చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ప్రత్యేక కాశ్మీర్ ఎడిషన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ వేదికగా ఉగ్రవాదం అణిచివేతపై ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ పర్యటన కోసం భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!
గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్లో పర్యటించారు. పాకిస్థాన్ దాడులతో దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అలాగే మరణించిన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!