నేడు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక ప్రకటన రానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది మాయదారి కరోనావైరస్.. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.. డెల్టా వేరియంట్ రూపంలో భారత్లో సెకండ్ వేవ్ విధ్వంసమే సృష్టించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వే ప్రారంభమై పోయింది.. 15 రాష్ట్రాల్లో థర్డ్వేవ్ స్టార్ట్ అయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఓవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ ఇప్పుడు క్రమంగా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి… మూడు, నాలుగు రోజుల క్రితం 20 వేలలోపు ఉన్న కేసులు ఇప్పుడు లక్ష వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ పద్దతితో ఇవాళ సీఎంలతో భేటీకానున్న ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్ పరిస్థితి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు.. అలాగే ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కూడా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ..
Read Also: జనవరి 7, శుక్రవారం దినఫలాలు…
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ఇక, కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది కేంద్రం.. కోవిడ్ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు కూడా రాసింది.. అంతేకాకుండా జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో సిబ్బంది మౌలిక వసతులు, పడకల లభ్యత చూసకోవాలని సూచించింది. మరోవైపు, రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ కఠిన ఆంక్షలు, కంటైన్మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం కీలకంగా మారింది… ఈ భేటీలో ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాని రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు. మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తారా..? లాక్డౌన్ వైపు అడుగులు వేస్తారా..? రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!