నేడు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక ప్రకటన రానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది మాయదారి కరోనావైరస్.. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.. డెల్టా వేరియంట్ రూపంలో భారత్లో సెకండ్ వేవ్ విధ్వంసమే సృష్టించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వే ప్రారంభమై పోయింది.. 15 రాష్ట్రాల్లో థర్డ్వేవ్ స్టార్ట్ అయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఓవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ ఇప్పుడు క్రమంగా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి… మూడు, నాలుగు రోజుల క్రితం 20 వేలలోపు ఉన్న కేసులు ఇప్పుడు లక్ష వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ పద్దతితో ఇవాళ సీఎంలతో భేటీకానున్న ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్ పరిస్థితి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు.. అలాగే ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కూడా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ..
Read Also: జనవరి 7, శుక్రవారం దినఫలాలు…
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ఇక, కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది కేంద్రం.. కోవిడ్ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు కూడా రాసింది.. అంతేకాకుండా జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో సిబ్బంది మౌలిక వసతులు, పడకల లభ్యత చూసకోవాలని సూచించింది. మరోవైపు, రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ కఠిన ఆంక్షలు, కంటైన్మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం కీలకంగా మారింది… ఈ భేటీలో ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాని రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు. మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తారా..? లాక్డౌన్ వైపు అడుగులు వేస్తారా..? రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..