PM Modi: పరీక్షా పే చర్చలో భాగంగా కాసేపట్లో విద్యార్థులకు చిట్కాలు చెప్పనున్న మోడీ
- కాసేపట్లో పరీక్షా పే చర్చ
- ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రధాని
- విద్యార్థులకు చిట్కాలు చెప్పనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్ ప్రారంభించేశారు. అయితే పరీక్షల సమయంలో ప్రతి ఏడాది ప్రధాని మోడీ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం అయి కొన్ని చిట్కాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగా సోమవారం పరీక్షా పే చర్చలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు, తల్లిదండ్రులతో మోడీ సమావేశం కానున్నారు. ఇందుకోసం మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పరీక్షలు ముగింపు కాదు. కొత్త ప్రారంభం. పరీక్షల ఒత్తిడి లేకుండా చేద్దాం! మీ అందరినీ ఉదయం 11 గంటలకు కలుస్తా’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Lok Sabha: నేడు లోక్సభ ముందుు కొత్త ఆదాయపు పన్ను బిల్లు!
పరీక్షా పే చర్చలో భాగంగా దేశం నలుమూలల నుంచి సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రధానంగా విద్యార్థులు పరీక్ష ఒత్తిడి ఎలా జయించాలన్న విషయంపై సూచనలు, సలహాలు మోడీ ఇవ్వనున్నారు. అంతేకకుండా ఉపాధ్యాయులతో కూడా మోడీ సంభాషించనున్నారు. ఒత్తిడి లేని పరీక్షలు, మానిసక ఆరోగ్యం, విజయ వ్యూహాలపై చిట్కాలు ఇవ్వనున్నారు. ఇక క్రీడలు, క్రమశిక్షణా సెషన్లో ఎంసీ మేరీ కోమ్, అవని లేఖరా, సుహాస్ యతిరాజ్ పాల్గొంటారు. మానసిక ఆరోగ్యంపై దీపికా పదుకొనే మాట్లాడనున్నారు.
Let’s help our #ExamWarriors overcome exam stress. Do watch ‘Pariksha Pe Charcha’ at 11 AM tomorrow, 10th February. #PPC2025 pic.twitter.com/7Win0bF8fD
— Narendra Modi (@narendramodi) February 9, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!