PM Modi: ఉగ్ర దాడికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టం
- జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిని ఖండించిన ప్రధాని మోడీ..
- ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరిక..
- మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అలాగే, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. దాడి గురించిన వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా అమిత్ షాకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఘటనపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక, ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: Vijayashanthi: ‘సరిలేరు నీకెవ్వరు‘ విషయంలో అంత తృప్తిగా లేరు.. ప్రేక్షకులు సంతృప్తి కోసమే ఇలా!
కాగా, జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా తన ఇంట్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో వర్చువల్ గా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసులు, పారామిలిటరీ భద్రతా సంస్థ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీనియర్ అధికారులు హాజరయ్యారు. బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడి గురించి కీలక అంశాలపై చర్చించారు. కాగా, కాసేపట్లో శ్రీనగర్ కు అమిత్ షా చేరుకోనున్నారు.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
Those behind this heinous act will be brought…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!