PM Modi: ఏ రోజైనా అభివృద్ధి గురించి ఆలోచించారా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఫైర్
- ఏ రోజైనా అభివృద్ధి గురించి ఆలోచించారా?
- బీహార్ టూర్లో కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీపై నిప్పులు చెరిగారు. బీహార్లో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తూర్పు భారతదేశంలో సమగ్ర అభివృద్ధికి ‘విక్షిత్ బీహార్’ ఎంతైనా అవసరం ఉందని చెప్పారు. యూపీఏ, ఆర్జేడీ ప్రభుత్వాల కాలంలో కేవలం రూ.2లక్షల కోట్ల గ్రాంట్లు మాత్రమే మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపిస్తే.. సరికొత్త బీహార్ను చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: బర్త్ డే రోజు ఈడీ షాక్.. లిక్కర్ కేసులో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
బీహార్లో 3.5 కోట్లకు పైగా మహిళలు బ్యాంకు ఖాతాలు పొందారరని.. గత 1.5 సంవత్సర కాలంలో బీహార్లో 24,000 స్వయం సహాయక బృందాలకు సహాయం అందించినట్లు చెప్పారు. 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్లతో సహాయం అందించినట్లు తెలిపారు. నార్వే మొత్తం జనాభా కంటే బీహార్కు ఎక్కువ ఇళ్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నార్వే, న్యూజిలాండ్, సింగపూర్ల మొత్తం జనాభా కంటే బీహార్కు ఎక్కువ ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని అడగాలన్న సుప్రీంకోర్టు
ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు.
#WATCH | PM Modi lays the foundation stone and inaugurates multiple development projects worth over Rs 7,200 crore at Motihari, Bihar
(Video source: DD) pic.twitter.com/GB6agYAA1j
— ANI (@ANI) July 18, 2025
VIDEO | Prime Minister Narendra Modi (@narendramodi) greets crowd in Bhojpuri at a public rally in Motihari, Bihar.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/PVKHGdRRnT
— Press Trust of India (@PTI_News) July 18, 2025
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..