PM Modi: ‘‘ధ్రువ నక్షత్రం’’లా భారత్-రష్యా స్నేహం..
- ధ్రువ నక్షత్రంలా భారత్-రష్యా స్నేహం..
- ఓడల నిర్మాణంలో ఇరు దేశాల సహకారం..
- పుతిన్ నాయకత్వంపై మోడీ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతను చూసిందని, మానవత్వం సవాళ్లను చూసిందని, కానీ భారత్ రస్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, రష్యా సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల సంబంధాలకు కృషి చేస్తున్న స్నేహితుడు పుతిన్కు కృతజ్ఞతలు తెలిపారు. గత 8 దశాబ్ధాలుగా భారత్-రష్యా స్నేహం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోడీ కొనియాడారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రాత్మక మైలురాళ్లు దాటుతున్న సమయంలో పుతిన్ భారత పర్యటనకు వచ్చారని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్ల క్రితం 2010లో భారత దేశానికి ప్రత్యే ప్రివిలేజ్డ్ స్టాటజిక్ పార్ట్నర్ షిఫ్ హోదా లభించింది. గత రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ నాయతక్వం, దార్శనికతతో ఈ సంబంధాలు పెరిగాయి. ఆయన నాయకత్వం, అన్ని పరిస్థితుల్లోనూ మా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చింది. భారతదేశం పట్ల ఈ లోతైన స్నేహం, అచంచలమైన నిబద్ధతకు నా స్నేహితుడు, అధ్యక్షుడు పుతిన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: Virtual Reception: ఇండిగో విమానం రద్ధు.. ఆన్ లైన్ లో రిసెప్షన్
ఓడల నిర్మాణంలో ఇరు దేశాల సహకారం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందని, ఇది మా విన్-విన్ సహకారానికి మరో ఉదాహరణ అని మోడీ అన్నారు. దీని ద్వారా ఉద్యోగాలు, నైపుణ్యాలు, ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. భారత్-రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత బలమైన మూలస్తంభంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్ నిర్ధారించడంలో కీలకమైన ఖనిజాలలో రెండు దేశాల సహకారం చాలా ముఖ్యమైందని అన్నారు.
ఆర్థిక సహకారాన్ని పెంచడానికి, రెండు దేశాలు విజన్ 2030 డాక్యుమెంట్పై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సమస్యపై భారత్ శాంతిని సమర్థించిందని, భారత్ ఎల్లప్పుడూ తన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..