PM Modi: ‘‘ధ్రువ నక్షత్రం’’లా భారత్-రష్యా స్నేహం..
- ధ్రువ నక్షత్రంలా భారత్-రష్యా స్నేహం..
- ఓడల నిర్మాణంలో ఇరు దేశాల సహకారం..
- పుతిన్ నాయకత్వంపై మోడీ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతను చూసిందని, మానవత్వం సవాళ్లను చూసిందని, కానీ భారత్ రస్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, రష్యా సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల సంబంధాలకు కృషి చేస్తున్న స్నేహితుడు పుతిన్కు కృతజ్ఞతలు తెలిపారు. గత 8 దశాబ్ధాలుగా భారత్-రష్యా స్నేహం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోడీ కొనియాడారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రాత్మక మైలురాళ్లు దాటుతున్న సమయంలో పుతిన్ భారత పర్యటనకు వచ్చారని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్ల క్రితం 2010లో భారత దేశానికి ప్రత్యే ప్రివిలేజ్డ్ స్టాటజిక్ పార్ట్నర్ షిఫ్ హోదా లభించింది. గత రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ నాయతక్వం, దార్శనికతతో ఈ సంబంధాలు పెరిగాయి. ఆయన నాయకత్వం, అన్ని పరిస్థితుల్లోనూ మా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చింది. భారతదేశం పట్ల ఈ లోతైన స్నేహం, అచంచలమైన నిబద్ధతకు నా స్నేహితుడు, అధ్యక్షుడు పుతిన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also: Virtual Reception: ఇండిగో విమానం రద్ధు.. ఆన్ లైన్ లో రిసెప్షన్
ఓడల నిర్మాణంలో ఇరు దేశాల సహకారం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందని, ఇది మా విన్-విన్ సహకారానికి మరో ఉదాహరణ అని మోడీ అన్నారు. దీని ద్వారా ఉద్యోగాలు, నైపుణ్యాలు, ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. భారత్-రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత బలమైన మూలస్తంభంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్ నిర్ధారించడంలో కీలకమైన ఖనిజాలలో రెండు దేశాల సహకారం చాలా ముఖ్యమైందని అన్నారు.
ఆర్థిక సహకారాన్ని పెంచడానికి, రెండు దేశాలు విజన్ 2030 డాక్యుమెంట్పై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సమస్యపై భారత్ శాంతిని సమర్థించిందని, భారత్ ఎల్లప్పుడూ తన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!