PM Modi: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిందూర మొక్కను నాటిన మోడీ
- తన నివాసంలో సిందూర మొక్కను నాటిన మోడీ
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన ప్రధాని
- గుజరాత్ పర్యటనలో సిందూర మొక్కను ఇచ్చిన వీర వనితలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గురువారం తన నివాసంలో ‘సిందూర’ మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా శౌర్యం, ప్రేరణకు బలమైన చిహ్నంగా సిందూర మొక్క నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: 2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!
Also Read
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
1971 యుద్ధంలో అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళల బృందం.. ప్రధాని మోడీకి సిందూర మొక్కను బహుకరించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో ఉండగా ఈ మొక్కను మహిళల బృందం ఇచ్చింది. వారి చర్యకు ముగ్ధుడనై తన నివాసంలో నాటుతానని వారికి హామీ ఇచ్చినట్లు మోడీ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: 9వ తరగతి పాస్కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు.. తేజస్వి యాదవ్పై విసుర్లు
తాజాగా ఆ మొక్కను గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో నాటారు. ఇటీవల భారతదేశం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. తాజాగా నాటిన మొక్క కూడా దానికి సూచనగానే భావిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతి చర్యగా పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పరుషులను చంపి స్త్రీల సిందూరాన్ని తుడిచేశారు. అందుకోసమే.. ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టారు.
ఇక ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం ప్రతి దేశం స్వార్థానికి అతీతంగా ఎదగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తమని, గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా భారతదేశం దీనిపై నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश… pic.twitter.com/GsHCCNBUVp
— Narendra Modi (@narendramodi) June 5, 2025
తాజావార్తలు
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!