Prashant Kishor: 9వ తరగతి పాస్కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు.. తేజస్వి యాదవ్పై విసుర్లు
- 9వ తరగతి పాస్కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు
- తేజస్విని రాజును చేయాలని లాలూ ఉబలాటపడుతున్నారు
- తేజస్వి యాదవ్పై ప్రశాంత్ కిశోర్ విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. పిల్లల గురించి ఎలా చింతించాలో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి నేర్చుకోవాలని.. 9వ తరగతి పాస్ కాని కొడుకు కోసం ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. తేజస్వి యాదవ్.. బీహార్కు రాజు కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బుధవారం బీహార్లోని సరన్లో జరిగిన సభలో ప్రశాంత్ కిషోర్ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
‘‘ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్ యాదవ్ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ 9వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తేజస్వీని బీహార్కు రాజును చేయాలని ఉబలాటపడుతున్నారు. మేము ఇలా మాట్లాడుతుంటే.. ఆయన్ను విమర్శిస్తున్నామని ప్రజలు అంటున్నారు. కాదు.. మేము ఆయన్ను ప్రశంసిస్తున్నాం. సామాన్య ప్రజల పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా.. వారికి ఉద్యోగాలు రావడం లేదు’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: విజయోత్సవాలు వద్దని చెప్పాం.. ఆర్సీబీ వినలేదు!
బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నిరుద్యోగ యువత కోపంగా ఉందని తెలిపారు. ర్యాలీలకు వస్తు్న్న స్పందన చూస్తుంటే.. బీహార్ను పీడిస్తున్న అవినీతి పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారని.. అందుకే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. పెరుగుతున్నది తన వ్యక్తిగత గ్రాఫ్ కాదని.. బీహార్లో నిజమైన మార్పును చూడాలనుకునే ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ర్యాలీకి వచ్చిన వారు తన బంధువులు కాదని.. తన కులానికి చెందిన వారు కూడా కాదని.. సమాజంలోని విభిన్న వర్గాల నుంచి వ్యక్తమైన నిరాశకు ఇది ప్రధాన కారణం అన్నారు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!