Prashant Kishor: 9వ తరగతి పాస్కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు.. తేజస్వి యాదవ్పై విసుర్లు
- 9వ తరగతి పాస్కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు
- తేజస్విని రాజును చేయాలని లాలూ ఉబలాటపడుతున్నారు
- తేజస్వి యాదవ్పై ప్రశాంత్ కిశోర్ విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. పిల్లల గురించి ఎలా చింతించాలో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి నేర్చుకోవాలని.. 9వ తరగతి పాస్ కాని కొడుకు కోసం ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. తేజస్వి యాదవ్.. బీహార్కు రాజు కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బుధవారం బీహార్లోని సరన్లో జరిగిన సభలో ప్రశాంత్ కిషోర్ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
‘‘ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్ యాదవ్ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ 9వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తేజస్వీని బీహార్కు రాజును చేయాలని ఉబలాటపడుతున్నారు. మేము ఇలా మాట్లాడుతుంటే.. ఆయన్ను విమర్శిస్తున్నామని ప్రజలు అంటున్నారు. కాదు.. మేము ఆయన్ను ప్రశంసిస్తున్నాం. సామాన్య ప్రజల పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా.. వారికి ఉద్యోగాలు రావడం లేదు’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: విజయోత్సవాలు వద్దని చెప్పాం.. ఆర్సీబీ వినలేదు!
బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నిరుద్యోగ యువత కోపంగా ఉందని తెలిపారు. ర్యాలీలకు వస్తు్న్న స్పందన చూస్తుంటే.. బీహార్ను పీడిస్తున్న అవినీతి పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారని.. అందుకే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. పెరుగుతున్నది తన వ్యక్తిగత గ్రాఫ్ కాదని.. బీహార్లో నిజమైన మార్పును చూడాలనుకునే ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ర్యాలీకి వచ్చిన వారు తన బంధువులు కాదని.. తన కులానికి చెందిన వారు కూడా కాదని.. సమాజంలోని విభిన్న వర్గాల నుంచి వ్యక్తమైన నిరాశకు ఇది ప్రధాన కారణం అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..