PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
- మన్మోహన్ సింగ్ నివాసానికి ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా..
- మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నిన్న (గురువారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు (డిసెంబర్ 27) ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోడీతో పాటే కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతరులు మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చారు.
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
Also Read
అయితే, మన్మోహన్ సింగ్ గురువారం నాడు సాయంత్రం ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఇక, మన్మోహన్ సింగ్ 2004-2014 వరకు పదేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వహించారు. అలాగే, ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగానూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం రేపు (శనివారం) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నారు. రేపు (డిసెంబరు 28) రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!