Bihar: ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
- ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక
- మహిళా రోజ్గార్ యోజన పథకం ప్రారంభం
- ఖాతాల్లో రూ.10 వేలు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Students Protest: ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
తన సోదరి ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నప్పుడే, కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సోదరుడు సంతోషంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇందుకోసం మీ సోదరుడు అవసరమైంది చేస్తాడని తెలిపారు. ఈరోజు ఇద్దరు సోదరులు మోడీ, నితీష్ కుమార్.. మీ శ్రేయస్సు కోసం, ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు నేటి పనే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ పథకం గురించి నితీష్ కుమార్ చెప్పినప్పుడు దార్శనికతను చూసి చాలా సంతోషించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ కచ్చితంగా లబ్ధి పొందుతుందని వివరించారు.
మన కుమార్తెలు ఇప్పుడు యుద్ధ విమానాలు నడుపుతున్నారని.. కానీ ఒకప్పుడు బీహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పటి రోజులు ఎవరూ మరిచిపోకూడదన్నారు. అదంతా లాంతరు పాలన.. ఆ సమయంలో మహిళలు అక్రమం, అవినీతి భారాన్ని భరించారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధాన రోడ్లు శిథిలావస్థకు చేరినప్పుడు.. ఎక్కువగా మహిళలే ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా రాత్రింబవళ్లు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
#WATCH | On launching Bihar's Mukhyamantri Mahila Rojgar Yojana, PM Modi says, "A brother feels happy when his sister is healthy, happy, and her family is financially strong, and for this, the brother does whatever is needed. Today, your two brothers Narendra and Nitish ji are… pic.twitter.com/xthDN9pr8I
— ANI (@ANI) September 26, 2025
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!