Bihar: ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
- ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక
- మహిళా రోజ్గార్ యోజన పథకం ప్రారంభం
- ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Students Protest: ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
తన సోదరి ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నప్పుడే, కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సోదరుడు సంతోషంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇందుకోసం మీ సోదరుడు అవసరమైంది చేస్తాడని తెలిపారు. ఈరోజు ఇద్దరు సోదరులు మోడీ, నితీష్ కుమార్.. మీ శ్రేయస్సు కోసం, ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు నేటి పనే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ పథకం గురించి నితీష్ కుమార్ చెప్పినప్పుడు దార్శనికతను చూసి చాలా సంతోషించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ కచ్చితంగా లబ్ధి పొందుతుందని వివరించారు.
మన కుమార్తెలు ఇప్పుడు యుద్ధ విమానాలు నడుపుతున్నారని.. కానీ ఒకప్పుడు బీహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పటి రోజులు ఎవరూ మరిచిపోకూడదన్నారు. అదంతా లాంతరు పాలన.. ఆ సమయంలో మహిళలు అక్రమం, అవినీతి భారాన్ని భరించారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధాన రోడ్లు శిథిలావస్థకు చేరినప్పుడు.. ఎక్కువగా మహిళలే ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా రాత్రింబవళ్లు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
#WATCH | On launching Bihar's Mukhyamantri Mahila Rojgar Yojana, PM Modi says, "A brother feels happy when his sister is healthy, happy, and her family is financially strong, and for this, the brother does whatever is needed. Today, your two brothers Narendra and Nitish ji are… pic.twitter.com/xthDN9pr8I
— ANI (@ANI) September 26, 2025
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!