Mallikarjun Kharge: మోడీకి ఉగ్రదాడి గురించి 3 రోజుల ముందే తెలుసు.. ఖర్గే సంచలన ఆరోపణ..
- ఉగ్రదాడి గురించి ప్రధాని మోడీకి 3 రోజుల ముందే తెలుసు..
- దాడి గురించి ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి..
- సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.
Read Also: Catherine Tresa : ‘మెగా’ ఆఫర్ కొట్టేసిన బన్నీ హీరోయిన్..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
‘‘ఈ దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ప్రభుత్వం దీనిని అంగీకరించింది. వారికి దీని గురించి తెలిస్తే ఎందుకు ఏం చేయలేదు.? దాడికి మూడు రోజుల ముందే ప్రధాని మోడీకి ఇంటెలిజెన్స్ నివేదిక పంపించినట్లు నాకు సమాచారం అందింది. అందువల్లే ఆయన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిని నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను’’ అని ఖర్గే అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిలో నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించిందని ఖర్గే చెప్పారు.
దాడి తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు సమాధానంగా.. పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. పహల్గామ్లో ఘోరమైన ఉగ్రవాద దాడికి కొన్ని రోజుల ముందు.. పర్యాటకులను, ముఖ్యంగా జబర్వాన్ శ్రేణి పర్వత ప్రాంతంలోని శ్రీనగర్ శివార్లలోని హోటళ్లలో బసచేసే వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి.
తాజావార్తలు
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!