PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..
- కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలు..
- కేరళ స్టోరీ, ధురంధర్పై కూడా అబద్ధాలు ప్రచారం..
- కేరళ ఎన్నికల ర్యాలీలో ప్రధాని తీవ్ర విమర్శలు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కేరళ స్టోరీ నుంచి ధురంధర వరకు ప్రతీ సినిమా అబద్ధమని చెబుతున్న ఈ పార్టీలే అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యారని ఆయన అన్నారు. కేరళలోని తిరువల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యాయని విమర్శించారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (FCRA), యూనిఫాం సివిల్ కోడ్ (UCC)లకు ఇటీవల చేసిన సవరణలపై అనవసర భయాలు సృష్టిస్తు్న్నారని మండిపడ్డారు.
దేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇరాన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయ వలసదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహించారు. ఎన్నికల ప్రయోజనం కోసం ఈ వలసదారుల భద్రతను కాంగ్రెస్ ప్రమాదంలోకి నెడుతోందని విమర్శించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటల ద్వారా గల్ఫ్ దేశాలో భారత్కు ఉన్న బంధాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పశ్చిమాసియా దేశాలు భారత్ను శత్రువుగా చూడాలని చూస్తున్నారని కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఇరాన్లో పనిచేస్తున్న తమిళనాడు, గోవా, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన భారతీయ మత్స్యకారులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని రక్షించే పనిలో ప్రభుత్వం చురుకుగా నిమగ్నమై ఉందని, ఇప్పటికే వందలాది మంది సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. గల్ఫ్, ఇరాన్లో ఉంటున్న భారతీయుల భద్రతకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
శబరిమల ఆలయం నుంచి బంగారం అదృశ్యం కావడంపై మోడీ మాట్లాడుతూ.. పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి రెండు వైపులు అని అన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!