Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, Diesel, LPG: అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి పరిస్థితుల కారణంగా ఎన్నో అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. దీంతో.. పెద్ద ఎత్తున ప్రజలు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం.. గ్యాస్ ఉండగనే మళ్లీ మళ్లీ బుక్ చేయడంతో.. కృత్రిమ కొరత ఏర్పడిన పరిస్థితి.. అయితే, ఆ తర్వాత ఇప్పుడు అంతా సాధారణంగా మారిపోయింది.. అయితే, దేశంలో ఇంధన సరఫరాలపై వస్తున్న భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాలను అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని ప్రజలకు స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. దేశంలో ఇంధన సరఫరాలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు పూర్తిగా నిండుగా ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్తో పాటు వంటగ్యాస్ (ఎల్పీజీ), పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు (పిఎన్జి) కూడా నిరంతరాయంగా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. భయాందోళనలతో ఎక్కువ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే శక్తి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని కూడా సూచించింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ప్రత్యేకంగా గృహాలు, ఆసుపత్రులు మరియు అత్యవసర సేవలకు ఎల్పీజీ, పిఎన్జీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. డిమాండ్ను సమతుల్యం చేయడానికి రిఫైనరీల ఉత్పత్తిని పెంచడం, ఎల్పీజీ రీఫిల్ల మధ్య సమయాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇంధన సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెటింగ్పై దేశవ్యాప్తంగా 3,700కిపైగా దాడులు నిర్వహించి, సుమారు 1,000 ఎల్పీజీ డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే 27 మంది డీలర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఇటీవలి గణాంకాల ప్రకారం, ఒకే రోజులో సుమారు 5.1 మిలియన్ ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి. మొత్తం డిమాండ్లో 95 శాతం ఆన్లైన్ బుకింగ్ల ద్వారానే నెరవేర్చబడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను కొంతవరకు నియంత్రిస్తూ, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఇంధనాలు అయిన కిరోసిన్, బొగ్గు వినియోగాన్ని కూడా పెంచుతున్నట్లు తెలిపింది. అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పనిచేస్తున్నాయని, దేశంలో ఇంధన కొరతకు ఎలాంటి అవకాశం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. మొత్తంగా, ప్రజలు అపోహలకు లోనవకుండా, అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఇంధనం వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!