Minister Suresh Khade: మోదీ ఈ దేశానికి ఆత్మ.. ఎప్పుడూ ఓడిపోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Is The Soul Of India Says Maharashtra Minister Suresh Khade : ప్రధాని నరేంద్రమోదీ మన భారతదేశానికి ఆత్మ లాంటి వారని, ఆయన ఎప్పటికీ ఓడిపోడు అంటూ మహారాష్ట్ర మంత్రి సురేశ్ ఖాడే వ్యాఖ్యానించారు. మోదీ అత్యంత శక్తివంతమైన నాయకుడని కొనియాడారు. ఆనాటి ప్రధానమంత్రులైన అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరా గాంధీ సైతం ఓటములు చవిచూశారని.. కానీ మోదీ ఎప్పటికీ ఓడిపోరని అన్నారు. చివరికి భారతీయ జనతా పార్టీ అధిపతి అయిన ఎల్కే అద్వానీ సైతం ఎన్నికల్లో ఓడారని చెప్పారు. కానీ, ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే.. 1977 నుంచి 2014 వరకు అద్వానీ ప్రతి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.
అయినా.. మంత్రి సురేశ్ ఖాడే ఉన్నట్టుండి మోదీపై ఇంతలా ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలే! బారామతి ప్రాంతంలో శరద్ పవార్, ఆయన బంధువుని ఓడించడం అసాధ్యమని ఆయన ముంబైకి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంధార్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాక సూర్యుడు ఉదయించొచ్చేమో గానీ.. బారామతి గడ్డపై పవార్స్కు రాజకీయ ఓటమి అనేది ఉండదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గానే.. మోదీ బారతదేశానికి ఆత్మ అని, ఆయన ఏ ఎన్నికల్లోనూ ఓడిపోడని సురేశ్ ఖాడే అన్నారు. ఇతరుల మాదిరిగానే ప్రజల ఓట్ల దయతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్తే.. ఆయన ప్రజల మనసుల్లో ఉన్నారని ఆ మంత్రి బదులిచ్చారు.
Also Read
కాగా.. ఇందిరా గాంధీ 1977లో లోక్సభ ఎన్నికల్లో ఓడారు. అటల్ బిహారీ వాజ్పేయి 1955లో బైపోల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో రెండు సీట్లలో పోటీ చేయగా, ఒక స్థానంలో పరాజయం పొందారు. అనంతరం 1962, 1984 ఆయన ఓటమి చవిచూశారు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!