PM Modi: ధియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
జార్ఖండ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ రాష్ట్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపుల నిల్చొని ఘనస్వాగతం పలకగా.. అందరికీ అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. జార్ఖండ్లో ఆయన రూ.16,800కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్తగా 657 ఎకరాల విస్తీర్ణంలో రూ.401కోట్లతో నిర్మించిన ధియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. నూతన ఎయిర్పోర్టులో ధియోఘర్ నుంచి కోల్కతాకు ఇండిగో విమాన సర్వీస్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. మే 25, 2018న డియోఘర్ బాబా బైద్యనాథ్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో పాటు పర్యాటకం, వాణిజ్య అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని అన్నారు. పక్క రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయన్నారు. ఈ విమానాశ్రయం కోల్కతా, పాట్నా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు విమాన సర్వీసులను అందించడంతోపాటు వేగవంతమైన కనెక్టవిటీని అందిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
KCR: కేసీఆర్ చెప్పినా పట్టించుకోరా?
2010లో తన మదిలో మెదిలిన ఈ ఎయిర్పోర్టు కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఈ ప్రాజెక్టు తమకు గర్వకారణమన్నారు.బాబా బైద్యనాథ్ ధామ్కి నేరుగా కనెక్టివిటీని వేగవంతం చేయడానికి రూ.401 కోట్లతో విమానాశ్రయం ప్రారంభించబడిందన్నారు. ఇది దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బాబా బైద్యనాథ్ ధామ్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!