Shashi Tharoor: మోడీ అద్భుతమైన నేత.. శశిథరూర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. ఏది మాట్లాడిన అందులో లాజిక్ ఉంటుంది.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు, సెటైర్లు వేసే ఆయన.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ శక్తిమంతమైన, డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయంలో మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్న అన్నారు శశిథరూర్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు జైపూర్ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడతూ.. రాజకీయంగా నరేంద్ర మోడీ చైతన్యవంతంగా ఉంటారని ప్రశంసించారు. మోడీ సారథ్యంలో బీజేపీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని తాను ఊహించలేదన్న ఆయన.. కానీ మోడీ నెగ్గి చూపించారని పేర్కొన్నారు.
Read Also: KTR: ఇలా చేయండి.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
మరోవైపు, భారతీయ ఓటర్లు ఎవ్వరికైనా షాక్ ఇవ్వగలరని వ్యాఖ్యానించారు శశిథరూర్.. ఒకరోజు బీజేపీకి కూడా వాళ్లు షాక్ ఇస్తారని తెలిపారు.. ప్రస్తుతానికైతే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కాషాయ పార్టీ ఏం కోరుకుంటే అదే జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ అద్భుతమైన శక్తి మరియు చైతన్యం ఉన్న వ్యక్తి అని, ముఖ్యంగా రాజకీయంగా చాలా ఆకట్టుకునే కొన్ని పనులు చేశారని అన్నారు. మరోవైపు.. మోడీపై విమర్శలు కూడా చేశారు శశిథరూర్.. మన దేశాన్ని మతపరమైన ప్రాతిపదికన విభజించే శక్తులను సమాజంలో నింపారని.. నా అభిప్రాయం ప్రకారం, ఇది ఒక విషాన్ని ప్రవేశపెడుతోంది.. ఇది దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ విశ్లేషకులు యూపీ ఎన్నికల ఫలితాలను “ముందస్తు ముగింపు”గా అభివర్ణించడంపై తాను ఆశ్చర్యపోయానని, ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా తక్కువ మంది మాత్రమే బీజేపీ విజయాన్ని అంచనా వేశారని తెలిపారు.. ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా మంది చాలా గట్టి ఫైన్ ఉంటుందని ఆశించారని పేర్కొన్నారు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై స్పందించిన శశిథరూర్.. పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా విశేషంగా ప్రచారం చేశారని తెలిపారు.. అయితే, ఒక వ్యక్తి ప్రచారంతో కాంగ్రెస్ ను తప్పుపట్టొచ్చని తాను భావించడంలేదన్నారు.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..