Shashi Tharoor: మోడీ అద్భుతమైన నేత.. శశిథరూర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. ఏది మాట్లాడిన అందులో లాజిక్ ఉంటుంది.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు, సెటైర్లు వేసే ఆయన.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ శక్తిమంతమైన, డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయంలో మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్న అన్నారు శశిథరూర్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు జైపూర్ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడతూ.. రాజకీయంగా నరేంద్ర మోడీ చైతన్యవంతంగా ఉంటారని ప్రశంసించారు. మోడీ సారథ్యంలో బీజేపీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని తాను ఊహించలేదన్న ఆయన.. కానీ మోడీ నెగ్గి చూపించారని పేర్కొన్నారు.
Read Also: KTR: ఇలా చేయండి.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
మరోవైపు, భారతీయ ఓటర్లు ఎవ్వరికైనా షాక్ ఇవ్వగలరని వ్యాఖ్యానించారు శశిథరూర్.. ఒకరోజు బీజేపీకి కూడా వాళ్లు షాక్ ఇస్తారని తెలిపారు.. ప్రస్తుతానికైతే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కాషాయ పార్టీ ఏం కోరుకుంటే అదే జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ అద్భుతమైన శక్తి మరియు చైతన్యం ఉన్న వ్యక్తి అని, ముఖ్యంగా రాజకీయంగా చాలా ఆకట్టుకునే కొన్ని పనులు చేశారని అన్నారు. మరోవైపు.. మోడీపై విమర్శలు కూడా చేశారు శశిథరూర్.. మన దేశాన్ని మతపరమైన ప్రాతిపదికన విభజించే శక్తులను సమాజంలో నింపారని.. నా అభిప్రాయం ప్రకారం, ఇది ఒక విషాన్ని ప్రవేశపెడుతోంది.. ఇది దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ విశ్లేషకులు యూపీ ఎన్నికల ఫలితాలను “ముందస్తు ముగింపు”గా అభివర్ణించడంపై తాను ఆశ్చర్యపోయానని, ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా తక్కువ మంది మాత్రమే బీజేపీ విజయాన్ని అంచనా వేశారని తెలిపారు.. ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా మంది చాలా గట్టి ఫైన్ ఉంటుందని ఆశించారని పేర్కొన్నారు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై స్పందించిన శశిథరూర్.. పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా విశేషంగా ప్రచారం చేశారని తెలిపారు.. అయితే, ఒక వ్యక్తి ప్రచారంతో కాంగ్రెస్ ను తప్పుపట్టొచ్చని తాను భావించడంలేదన్నారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!