PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
- విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే
- బీహార్ ఎన్నికల ర్యాలీలో మోడీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాఘట్బంధన్లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… విపక్ష కూటమిపై ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఆత్మాహుతి కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
Also Read
బీహార్కు ఇంకో లాంతరు అవసరం లేదన్నారు. ఇంత వెలుతురు ఉన్నప్పుడు.. మనకు ఇంకో లాంతరు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని తమ మొబైల్ టార్చిలైట్లను ఆన్ చేసుకోవాలని కోరారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని మహాఘట్బంధన్ కూటమిని ఎగతాళి చేశారు.
కర్పూరీ ఠాకూర్ను అవమానిస్తే బీహార్ సహించదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన దార్శనికతను ప్రజలకు శ్రేయస్సుగా మారుస్తోందని అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు ‘‘వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో బెయిల్పై బయట ఉన్నారు’’. అని ఆరోపించారు. వాళ్లంతా ఇప్పుడు కర్పూరి ఠాకూర్ ‘‘వారసత్వం, బిరుదును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు. గౌరవనీయ నాయకుడికి జరిగిన ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ సహించరని.. ఓట్లతో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Piyush Pandey: ఫెవికాల్, వొడాఫోన్ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే కన్నుమూత
‘‘జీఎస్టీ బచత్ ఉత్సవ్.’’ ప్రయోజనాలను బీహార్ ప్రజలు పొందుతున్నారని తెలిపారు. ఛత్ పూజ పండుగకు ముందు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ కొత్త వేగంతో ముందుకు సాగుతుందని’’ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి వేగవంతమైన అభివృద్ధి, శ్రేయస్సును హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్యం యొక్క గొప్ప పండుగ అని అభివర్ణించారు. బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
2005 అక్టోబర్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ ‘‘జంగల్ రాజ్’’ నుంచి విముక్తి పొందిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 10 సంవత్సరాలు పాలించినప్పుడు.. బీహార్ అభివృద్ధికి నిరంతరం అడ్డంకులు సృష్టించారని మోడీ ఆరోపించారు.
VIDEO | Bihar Elections 2025: Addressing an election rally in Samastipur, PM Modi (@narendramodi) asks people to switch on the light in their mobile phones and says, "When there is so much light… then do we need 'lalten' (lantern)? Bihar ko 'lalten' (RJD) aur uske saathi nahi… pic.twitter.com/WZHJhvn05S
— Press Trust of India (@PTI_News) October 24, 2025
#WATCH | Samastipur, Bihar | #BiharElection2025 | PM Narendra Modi says, "The trumpet of the grand festival of democracy has sounded. The entire Bihar is saying 'Phir Ek Baar NDA Sarkar'…" pic.twitter.com/brcH9gmXVg
— ANI (@ANI) October 24, 2025
#WATCH | Prime Minister Narendra Modi felicitated during the public meeting in Samastipur, Bihar
He will address the gathering shortly pic.twitter.com/cNr8W4uQT7
— ANI (@ANI) October 24, 2025
తాజావార్తలు
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!