PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- SRCC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం.
- ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యను మరోసారి ప్రస్తావించిన మోదీ.
- ఆ పదాన్ని హోమియోపతి పిల్తో పోల్చిన ప్రధాని.
- ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటీవల ఆందోళన, నిరసనల విషయంలో కూడా పరోక్షంగా స్పందించారు. ముఖ్యంగా యువత, జెన్-జీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశాభివృద్ధిపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరోసారి మోడీ ‘‘దిమాగీ నక్సల్స్’’ పదాన్ని ఉపయోగించారు. ఇటీవల ఎర్రకోటపై నుంచి మోడీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని ఉపయోగించారు.
‘‘ఎర్రకోట నుంచి నేను ‘దిమాగీ నక్సల్’ అనే హోమియోపతి పిల్ ఇచ్చాను. హోమియోపతిలో చికిత్స ప్రారంభించినప్పుడు మొదట్లో వ్యాధి తీవ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. అదే విధంగా నేను ‘దిమాగీ నక్సల్’ పిల్ ఇవ్వగానే ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నవారి నిజస్వరూపాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు’’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. SRCCలో 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను చేసిన ప్రసంగాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత ప్రధాని హోదాలో మళ్లీ వచ్చిన తర్వాత అప్పటికీ, ప్రస్తుత భారత్కు తేడాలను విద్యార్థుల ముందుంచారు.
Also Read
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
కేదార్నాథ్ విషాదాన్ని, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. కేదార్నాథ్ విపత్తు సమయంలో అప్పటి ప్రభుత్వం తడబడిందని విమర్శించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదని, బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైందని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి పశ్చిమాసియా సంక్షోభం వరకు ప్రతీ అంశాన్ని విద్యార్థుల ముందుంచారు. అనేక ప్రపంచ సంక్షోభాల సమయంలో భారత్ అద్భుతంగా మనుగడ సాధించిందని చెప్పారు. జెన్-జీతో కనెక్ట్ అయ్యేలా ప్రధాని మోడీ వారి భాషలోనే మాట్లాడారు. వారిని ఆకట్టుకునేందుకు జెన్-జీ పదాలను ఉపయోగించారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!