PM Modi: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికారిక నివాసం 7-లోక్ కళ్యాణ్ మార్గ్లో అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువు రంగాల పరిస్థితిపై సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశానికి చమురు, గ్యాస్, ఎరువుల కొరత లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు- ఎరువులు మరియు ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా, పెట్రోలియం- సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కార్మిక – ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తదితర సీనియర్ మంత్రులు మరియు అధికారులు హాజరయ్యారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమైంది. భారత్ కూడా గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని మోడీ, మంత్రులతో సమావేశమయ్యారు.
#WATCH | Delhi | PM Narendra Modi chairs a high-level meeting to review the situation related to petroleum, crude, gas, power and fertiliser sectors in view of the evolving West Asia situation. pic.twitter.com/SOP5TDzWmc
— ANI (@ANI) March 22, 2026